ఇంద్రవెల్లి, జనవరి 9 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాత ర పురస్కరించుకొని నాగోబా వనంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పారిశుధ్య, పిచ్చి మొక్కలు తొలగించే పనులు చేపడుతున్నారు. ఎఫ్బీవో జ్యోతి ఆధ్వర్యంలో నాగోబా వనం ముఖద్వారం, చెట్టుకు ఏర్పాటు చేసిన కంచెలు, జాలీలకు రంగులు వేసే పనులు చేశారు. నాగోబా వనంలో పేరుకుపోయిన చెత్తతో పాటు ఎండిన పిచ్చిమొక్కలు తొలగించారు. ముఖద్వారానికి రంగులు వేసి బోర్డుపై నాగోబా వనం అని పెయింటింగ్ చేయిస్తున్నట్లు ఎఫ్బీవో జ్యోతి తెలి పారు. సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 21న నాగోబా జాతరకు తరలివచ్చే భక్తులతో పాటు మర్రిచెట్ల వద్ద మూడు రోజులు బసచేసే మెస్రం వంశీయులకు అన్ని రకాల సౌక ర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాగోబా ఆలయ పరిసరాల తో పాటు మెస్రం వంశీయులు మూడు రోజులు బసచేసే మర్రిచెట్ల ప్రాంతంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక స్నానపు గదులు ఏర్పాటు చేశారు. ట్యాంకు నుంచి వృథాగా వెళ్లే నీరు పైపుల ద్వారా బయటకు పంపించే పనులు చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు దగ్గు రుండి పనులు చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం లో డీఈ శ్రీనివాస్, ఏఈ భానుకుమార్, సర్పం చ్ మెస్రం రేణుకానాగ్నాథ్ పాల్గొన్నారు.