కాంగ్రెసోళ్లు ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను తీసుకొస్తమంటున్నరు. అదే జరిగితే.. వ్యవసాయం, రైతన్న బతుకులు ధ్వంసమవుతాయి. డిజిటల్ వ్యవస్థ రద్దవుతుంది కాబట్టి సర్కారు వద్ద భూములు, రైతులు, పంట విస్తీర్ణం, దిగుబడి వంటి వివరాలు ఉండవు. ఫలితంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే లెక్క తేలదు. చివరకు పంటను అమ్ముకోవాలంటే దళారుల చుట్టూ తిరగాల్సి వస్తది. అష్టకష్టాలు పడి పండించిన పంటలను మద్దతు ధరకు కాకుండా దళారులు ఎంతిస్తే అంత తీసుకోవాల్సి వస్తది.
ఏ సమాచారం లేదన్న సాకుతో రైతుబంధు, రైతుబీమా అన్ని నిలిచిపోయే చాన్స్ ఉంది. ఇంకా, ఎరువులు, విత్తనాలు కూడా సకాలంలో సరఫరా కాకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడాల్సి వస్తుంది. మళ్లీ క్యూలైన్లు, జాగారా లు, టిఫిన్లు పట్టుకెళ్లి దుకాణాల వద్దనే పాత పద్ధతిలో ఉండాల్సిన దుస్థితి నెలకొనే పరిస్థితి ఉంది. గెట్టు పంచాయితీలు, భూ తగాదాలు అని ఠాణాలు, కోర్టుల చుటూ ్ట తిరగాల్సి వస్తది.
– ఆదిలాబాద్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ)
ఇచ్చోడ, నవంబర్ 25: కాంగ్రెస్ ధరణిని తీసేసి దళారుల రాజ్యం తెస్తమని అంటున్నది. మళ్లీ రైతులను దోపిడీ చేయాలని చూస్తు న్నట్లు కనిపిస్తున్నది. ధరణిని తీసేస్తే రైతులు ఆగమైతరు. ఇది వచ్చాకే మా భూములు ఇతరుల పేర బదలాయింపు చేయకుండా భద్రత వచ్చింది. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థతో కూడిన రెవెన్యూ విధానం వల్ల రైతులు అనేక కష్టాలు పడ్డరు. వారికి తెలియకుండానే రికార్డుల్లో పేరు మార్పిడి చేసేవారు. దీంతో రైతు తన పేర మార్పు చేసుకోవడానికి పటేల్, పట్వారీ, తహసీల్ కార్యాలయాల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగినా పనయ్యేది కాదు. రెవెన్యూ వ్యవస్థ ఉన్న సమయంలో బలం ఉన్నోనిదే రాజ్యం. రైతు తన చేతకాక పొలాన్ని కౌలుకు వేస్తాడు. అప్పుడు రికార్డులో కౌలుదారు పేరు ఎట్లా నమోదు చేస్తవు. అలా చేస్తే భూమిపై అసలు రైతు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ నాయకులు సోయి తప్పి మాట్లాడుతున్నరు.
– సలాంరావ్ పటేల్, రైతు, దుబార్పేట్
తెలంగాణ వ్యవసాయ రంగంలో విధ్వంసం సృష్టించేందుకు కాంగ్రెస్ కత్తులు నూరుతున్నది. ధరణిని రద్దు చేసి రాక్షస ఆనందం పొందాలని చూస్తున్నది. అది రైతులకు చేసే మంచి వాళ్లకేం ఎరుకైతలేదు. గిప్పుడు మా భూముల్ల ఎట్లాండి ఇబ్బంది లేదు. టైమ్కు రైతుబం ధు పడుతాంది. టైమ్కు విత్తనాలు, ఎరువులు అందుతున్నయ్. పండిన పంటను కొనుగోలు కూడా చేస్తున్నరు. గివన్నీ కాంగ్రెసోళ్లు ఉన్నప్పుడే యాడున్నయ్. ఇప్పుడు అన్ని అచ్చినయ్. కాంగ్రెసోళ్లు ఉన్నప్పుడు ఇయ్య చేతగానోళ్లు గిప్పుడొచ్చి.. ధరణిని రద్దు చే స్తాం.. భూముల్లో పంచాయితీలు పెడతాం. అధికారులకు రికార్డు లు రాసే అధికారం ఇస్తాం. కౌలుదారుకాలం పెట్టి మళ్ల గోస పెడ తాం అని చెప్తున్న కాంగ్రెసోళ్ల మాటలకు భయమైతాంది.
మళ్ల పాత రోజులు వత్తయంటే ఊరుకుంటమా.. వచ్చేటోళ్లను తరమికొట్టం.. ఎరువులు, విత్తనాలు లైన్లు కట్టే రోజులు.. మా భూమిని ఇంకొ ని పేరు మీద రాసి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే రోజులు మాకొద్దు.. అని రైతులు మండిపడుతున్నారు. పూటకో మాట.. రోజుకో ముచ్చట మారుస్తున్న కాంగ్రెస్తో ఎన్నటికున్నా డేంజరే అంటున్నరు. ఇప్పుడున్న వ్యవస్థే మంచిగ ఉన్నదని, మా భూము లు మాకు ఉన్నయని చెప్తున్నరు. ఇది గిట్లనే ఉండాలంటే మరోసారి బీఆర్ఎస్ సర్కార్ రావాలని ముక్తకంఠంతో నినదిస్తున్నరు.
– ఆదిలాబాద్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ)
ఉట్నూర్, నవంబర్ 25: కాంగ్రెసోళ్లు ధరణిని బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు. గట్ల చేస్తే ఊరుకునేది లేదు. వాళ్లకు గింతనన్న తెలివి ఉండాలె. ఇన్నాళ్లకు రైతుల భూముల కష్టాలు తీరినయ్. ఇగ ఇప్పుడు కాంగ్రెసోళ్లు కుట్రలు మొదలుపెట్టిన్రు. అయినా వాళ్లు గెలిచేది లేదు.. సచ్చేది లేదు. ఓ ఒర్రుతున్నరు. ఇది జెత్తం..అది జెత్తం అని. 50 ఏండ్లు ఏం జెసిన్రని వీళ్లకు ఓటెయ్యాలె. తెలంగాణ మంచిగుండాలంటే బీఆర్ఎస్సే రావాలె. ధరణి వచ్చినంకనే పల్లెల్లో భూ తగాదాలు తగ్గినయ్. మళ్లీ దళారుల రాజ్యం తెద్దమని ఈ కాంగ్రెసోళ్లు కుట్రలు చేస్తున్నరు. ఇది మంచిది కాదు. రైతులను గోస పెట్టుకున్నోళ్లు బాగుపడరు. సీఎం కేసీఆర్ అందరినీ మంచిగ చూసుకుంటున్నరు.
– తుర్పుబాయి సాకేర-బీ, ఉట్నూర్
సొనాల, నవంబర్ 25: కాంగ్రెస్ హయంలో రైతుల భూములకు రక్షణ కరువు. పైసలిస్తే ఇష్టమున్న వారి పేరుమీద భూములు మారేవి దళారులు చెప్పినట్లే వ్యవస్థ మొత్తం నడిచేది. భూముల గురించి గొడవలు మస్తయ్యేటియి. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ బాధలు పోయినయ్. ధరణి పోర్టల్ను తీసుకువచ్చి భూముల వివరాలన్నీ ఆన్లైన్లో పెట్టిండ్రు, దీంతో చేతిలో ఉన్న ఫోన్లోనే ఎక్కడ ఉన్నా మా రికార్డులను మేం చూసుకుంటన్నం. భూమి అమ్మినా, కొన్నా యజమాని వేలిముద్ర పెడితెనే పట్టా మారుతుంది. ఇంత గట్టి వ్యవస్థను పెట్టిన కేసీఆర్ను కాదని మరొకరిని గెలిపిస్తమా? కేసీఆర్తోనే మా భూములకు రక్షణ. కాంగ్రెస్ మాటలు ఎవ్వలూ నమ్ముతలేరు. సీఎం కేసీఆర్నే మళ్లీ గెలిపిస్తమంటున్నరు.
– కినాటం నారాయణ, రైతు, సొనాల
ఇంద్రవెల్లి, నవంబర్ 25 : కాంగ్రెసోళ్లంటనే దళారి రాజ్యం. గతంలో వాళ్ల పని కూడా అదే. రైతులకు ఏనాడన్నా మంచి చేసిండా..? బీఆర్ఎస్తోనే రైతులకు పూర్తి రక్షణతోపాటు భూములకు భరోసా దొరికింది. ఏప్రభుత్వాలు గతంలో చేయని పనులను సీఎం కేసీఆర్ చేసిండు. ధరణి ద్వారా ఎంతో మార్పు వచ్చింది. భూముల రికార్డులన్నీ పారదర్శకంగా ఉంటున్నయ్. తహసీల్ ఆఫీసుల్లా పనులు కూడా తొందరగయితున్నయ్. ఆన్లైన్ లోనే మీసేవల్లో పహాణీలు తీసుకునుడు ఈజీగున్నది. గింత మంచిగ ఉంటే ఎందుకు బంగాళాఖాతంలో కలుపుతమంటున్నరో అర్థమైతలేదు. ఉట్టిగ రైతులను ఆగం పట్టిత్తున్రు. వీళ్ల ప్లానంతా వేరే ఉంది. భూములను గుంజుకుందమనే వీళ్ల ప్లాన్ ఉన్నట్లు ఉంది. అందుకే కాంగ్రెసోళ్లను నమ్మేది లేదు.
– పరత్వాగ్ రాహుల్, రైతు
నేరడిగొండ, నవంబర్ 25 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల కష్టాలు తెలిసి రెవెన్యూ సేవలు సులభతరం అయ్యేందుకు ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టడం హర్షిందగ్గ విషయం. గతంలో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాఫీగా భూక్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న రైతులను ఇబ్బందులు పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు పాత రెవెన్యూ విధానాలను తీసుకొస్తాం అంటున్నారు. అలా జరిగితే రైతులు పాత రోజులు మళ్లీ చవిచూడాల్సి వస్తది. కాంగ్రెస్ రానివ్వం. సీఎం కేసీఆర్ వెన్నంటే రైతులందరం ఉంటాం.
– రాథోడ్ ఆనంద్రావ్, ఆరెపల్లి, నేరడిగొండ
నార్నూర్,నవంబర్ 25 : ధరణి పోర్టల్తో భూములు భద్రంగా ఉండడంతో రైతులం కంటి నిండా నిద్ర పోతున్నం. ధరణి తీసేస్తే పైరవీకార్లు రాజ్యమేలుతరు. పట్వారీల వ్యవస్థలో క్షణాల్లో పహాణీలో పట్టాదారు పేరు దొంగతనంగా మార్చేది. గతంలో రైతులు చెప్పులరిగేలా తిరిగినా పనులు కాకపోయేది. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టడంతో దళారులు, లంచాలకు చెక్ పడింది. ధరణిని కాంగ్రెసోళ్లు బంగాళాఖాతంలో వేస్తామంటున్నరు. అసలు ధరణి కాదు. కాంగ్రెసోళ్లనే బంగాళఖాతంల వేయాలే. ధరణి పోర్టల్ రైతులకు సౌకర్యవంతంగా ఉన్నది. రిజిస్ట్రేషన్ చేయించుకోగానే పాస్బుక్ ఇంటికే వస్తున్నది. కాంగ్రెసోళ్లను నమ్మేది లేదు. ఆ పార్టీని రానిచ్చేది లేదు. వాళ్లనే ఓటు ద్వారా బంగాళఖాతంలో కలుపుదామని ప్రజలంతా అనుకుంటున్నరు. వీళ్లు గెలిచేది లేదు.. సచ్చేది లేదుకని అప్పుడే వంద మాటలు మాట్లాడుతున్నరు.
– కొడప జాకు, ఝరి, రైతు
బజార్హత్నూర్, నవంబర్ 25 : ధరణి వచ్చిన తర్వాతనే జీవితాలు కుదుటపడ్డాయి. తమ భూములకు ఢోకా ఏమి లేదని గుండెపై చేయి వేసుకొని హాయిగా నిద్రపోగలుగుతున్నాం. సీఎం కేసీఆర్ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కష్టాలను తీర్చేందుకు ధరణి పోర్టల్కు రూపకల్పన చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు ఒకే చోట పొందుపరిచి, భూముల నిర్వహణ అధికారుల చేతుల్లో నుంచి తీసివేయడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలుపోయాయి. రైతులు వచ్చి వేలి ముద్ర వేస్తేగాని భూమి పట్టా మార్పిడి జరగని పరిస్థితి తీసుకువచ్చిన కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతుబంధు, రైతు బీమా, పంటకొనుగోళ్లు వంటి ప్రయోజనలు కలిసోచ్చాయి, కానీ కాంగ్రెస్ హయాంలో అన్ని స్కాంలే మిగిలాయి. అలాంటి కాంగ్రెస్ పాలన మాకొద్దు. మా కేసీఆర్ పాలనే మాకు ముద్దు.
– డుబ్బుల చంద్రశేఖర్, రైతు, బజార్హత్నూర్