ఆదిలాబాద్, నవంబర్ 21 ( నమస్తే తెలంగాణ): “దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్న ధరణిపై కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కుతున్నది. పైసా ఖర్చులేకుండా సులభంగా.. వేగంగా.. పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు సాగుతుంటే ఓర్వలేక పోతున్నది. అధికారంలోకి రాంగనే ఆ పోర్టల్ను ఎత్తేస్తమని చెబుతున్నది. గదే జరిగితే పటేల్, పట్వారీ వ్యవస్థకు మళ్లా బీజం పడుతది. దోపిడీ మొదలైతది. పైరవీకారులు, లంచావతారులు పుట్టుకొస్తరు. కాసులిస్తే భూ రికార్డులు సైతం తారుమారు చేస్తరు. మళ్లా కొట్లాటలు మొదలైతయి. ఆఫీసులు, కోర్డుల చుట్టూ తిరగాల్సి వస్తది.” అని రైతులు మండిపడుతున్నారు. హస్తం నేతల రోజుకో ప్రకటనపై వారంతా ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ను నమ్మితే నట్టేట మునగడం ఖాయమని, రైతుపక్షపాతి అయిన బీఆర్ఎస్కే అండగా నిలుస్తామని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
స్వయంగా రైతుబిడ్డ అయిన సీఎం కేసీఆర్.. ముందు చూపుతో భూములకు రక్షణ కల్పించేందుకు ధరణిని తీసుకొచ్చారు. ఈ పోర్టల్ వల్ల భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అదే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో రెవెన్యూ శాఖలో తహసీల్దార్ మొదలుకొని.. కింది స్థాయిలోని వీఆర్వోల వరకు డబ్బులు ఇవ్వందే పని జరిగేది కాదు. పటేల్, పట్వారీ వ్యవస్థ, ఆ తర్వాత వచ్చిన రెవెన్యూ వ్యవస్థ.. ఇలా ఏదైనా సరే రైతులను ఏడిపించినయ్. అధికారులు రాత్రికి రాత్రే పట్టాదారుల పేర్లు మార్చి రైతుల బతుకులను ఆగం చేసేటోళ్లు. రాత పద్ధతిలో ఉన్న రికార్డుల్లో.. పహణీల్లో ఇష్టం వచ్చినట్లు మార్పులు, చేర్పులు చేసేటోళ్లు. పెన్ను పట్టి రాసిందే భూమి.. గీసెందే హద్దు.. రైతులకు తమ పేరు మీద ఉన్న భూమి వేరేటోళ్ల పేరుకు మారిందన్న ముచ్చటే తెలిసేది కాదు. అక్కరకో, ఆడబిడ్డ పెండ్లికో, కొడుకు చదువుకో భూమి అమ్ముకుందామని చూసే సరికి వాళ్ల పేరు మీద భూమి ఉండేది కాదు. అప్పుడు మొదలయ్యేది అసలు కథ.. ఎవుసం పక్కన పెట్టి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, వీఆర్వోల చుట్టూ తిరుగుడే సరిపోయేది. భూమి కోసం పైరవీలు కొట్లాటలు, గొడవలు, పోలీస్ స్టేషన్ పంచాయతీలు ఇవేవి తెగకపోతే కోర్టు దాకా పోక తప్పేది కాదు. కోర్టుకు పోయిన ముచ్చట ఎంతకూ తెగక అరిగోస పడాల్సి వచ్చేది.
ఈ పంచాయితీలన్నీ పహణీలో ఉన్న 31 కాలమ్స్తో మొదలయ్యేది. ముందుగా పహణీలో ఉన్న అనుభవదారుకాలంలో భూమి యాజమానిగా ఉన్న రైతు కాకుండా మరొకరి (కబ్జా దారు) పేరు ఎక్కించేటోళ్లు. అది జరిగిన ఏడాదిలోగా రైతు పహణీ చెక్ చేసుకోలేదా.. వచ్చే ఏడాదికి అనుభవదారు పట్టాదారు అయ్యేటోడు. అసలు పట్టాదారు రోడ్డున పడేటోడు. ఇప్పుడు కాంగ్రెస్ గిదే పనే చేస్తనని చెప్పుకొని ఓట్లు అడుగుతుంది. అనుభవదారు(కౌలు)దారు కాలమ్ తీసుకువచ్చి రైతులను మళ్లోసారి మోసం చేయాలని చూస్తున్నది. భూమిని అమ్ముకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా.. రైతు వచ్చి వేలిముద్ర పెడితేగానీ సాధ్యం గానీ డిజిటల్ వ్యవస్థ ధరణిని రద్దు చేస్తామంటున్నది. ధరణిని తీసేసి మళ్లీ రాత పుస్తకాలు తెచ్చి, వీఆర్వోలను పెట్టి, కౌలుదారు కాలమ్ తీసుకువచ్చి.. లంచం ఇస్తే చాలు హక్కు దారుల పేర్లను మార్చే వ్యవస్థను తీసుకురావాలని కుట్రలు పన్నుతున్నది. పదేళ్ల కిందట తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉండెనో.. గదే మళ్లీ తీసుకురావాలని చూస్తున్న కాంగ్రెస్కు పొరపాటున ఓటేసినా.. నట్టేట ముంచుడు ఖాయమని రైతులు భయపడిపోతున్నరు.
గిప్పుడే నిశ్చింతగా ఉంది..
సొనాల,నవంబర్ 21: ధరణి వచ్చినప్పటి నుంచే భూ ముల రక్షణ విషయంలో నిశ్చింతగా ఉన్నం. గిదివ రకు పహాణిల్లో వీఆర్వోలు ఇష్టమొచ్చినట్లు పేర్లు మార్చేది. ఆఫీసుల చుట్టూ తిరిగినా పనులు కాకపో యేటియి. ధరణి రాకముందు భూమి రిజిష్ర్టేషన్ చేసుకున్న తర్వాత మళ్లీ వీఆర్వో, ఆర్ఐల చుట్టూ జమాబందీ కోసం నెలల కొద్దీ తిరిగేది. గిప్పుడు గా బాధల్లేవ్. రిజిష్ర్టేషన్ కాగానే భూమిని పాస్పుస్తకా ల్లో ఎక్కిస్తున్నరు. డిజిటలైజేషన్ కావడంతో వేలి ముద్ర వేస్తే తప్ప రికార్డులు మారవు. రైతుల మేలు కోసం గింత మంచి ధరణి పోర్టల్ను సీఎం కేసీఆర్ తీసుకొస్తే దానిని తీసేస్తమని కాంగ్రెసోళ్లు అనడం సరికాదు. గట్లయితే మళ్లా రైతులు ఇబ్బంది పడుత రు. రైతులు నిశ్చింతగా ఉండుడు గా లీడర్లకు ఇష్టం లేనట్లున్నది. మల్లా దళార్ల రాజ్యం తెస్తమని చూస్తున్నట్లున్నరు.
– తుల గంగమ్మ, మహిళ రైతు, సొనాల
ధరణిలో భూముల వివరాలు ఎప్పుడైనా చూసుకోవచ్చు
ధరణిలో రైతులకు సంబంధించిన భూముల వివరాలు ఎప్పడైనా చూసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో భూముల రికార్డులు సరిగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పట్టా భూములు ఎవరి పేరు మీద మారుతాయో తెలియని పరిస్థితి ఉండేది. భూముల రికార్డులు చూసుకునేందుకు పహణీల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. రేపు, మాపంటూ వాళ్లు మస్తుగ సతాయించేటోళ్లు. ధరణి రావడంతో ఆ పరిస్థితి మారింది. ఫోన్లో రైతుల భూములకు సంబంధించిన వివరాలు చూసుకునే అవకాశం ఏర్పడింది.
– లక్ష్మణ్, రైతు, లోకారి. ఆదిలాబాద్ రూరల్
ధరణితో మస్తు సౌలతయ్యింది..
ఆదిలాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): గతంలో భూముల వివరాలు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. అవసరాల కోసం భూములు అమ్మాలన్నా, కొనాలన్నా తహసీల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఉండేది. పైసలు ఇస్తేగాని పనికాని పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం భూముల రికార్డులను సరిచేసి ధరణి పోర్టల్లో నమోదు చేసింది. ఇప్పు డు రైతులు భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ఎలాంటి ఇబ్బందులు లేవు. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత తహసీల్ కార్యాలయాల్లో 20 నిమిషాల్లో పని అయిపోతున్నది. ఈజీగా పని అయిపోతున్నది.
-ఇస్తారి, రైతు, జైనథ్
కాళ్లరిగేలా తిరిగేది..
బజార్హత్నూర్, నవంబర్ 21: బీఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ చాలా బాగుంది. పోర్టల్ ద్వా రా ఆరగంటలో భూమి రిజిస్ట్రేషన్ అయిపోతున్నది. 15రోజుల్లో పాసుబుక్ ఇంటికి వస్తున్నది. రూపాయి కూడా లంచం ఎవ్వరికీ ఇయ్యాల్సిన పనిలేదు. మన వేలిముద్ర వేస్తేనే పోర్టల్ ఓపెన్ అవుతుంది. మన భూమి ఎక్కడికీ పోదు. ల్యాండు కన్వర్షన్ కూడా పది నిమిషాల్లో అయిపోతున్నది. గతంలోనైతే పనులు కావాల్నంటే ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కింది నుంచి పైదాకా ప్రతి అధికారికీ లంచం ఇస్తనే పనయ్యేది. గిప్పుడు మళ్లా ఆ రోజుల్నే కాంగ్రెస్ తీసుకొస్తానంటున్నది. గట్ల చేస్తే మాలాంటి రైతులు మళ్లా ఇబ్బందులు పడుతరు.
-జయవంత్ రావు, కొల్హారి
బంగాళాఖాతంలో కాంగ్రెసోళ్లనే వేస్తరు..
తాంసి, నవంబర్ 21: కాంగ్రెసోళ్లు ధరణిని బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు. ముందుగాల వీళ్లనే అందులో వేస్తరు ప్రజలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే ధరణి తేవట్టి భూముల పనులు తొందరగైతున్నయ్. గియ్యాల రైతుబంధు, రైతుబీమా పతకాలు రైతులకు అండగా నిలుస్తున్నయ్. భూమి అమ్మాలన్నా, కొన్నాలన్నా ఇబ్బందులు తొలిగినయ్, పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్లు అవుతున్నయ్. భూ సమస్యలకు చెక్ పడింది. అనవసరంగా కాంగ్రెసోళ్లు ధరణి పోర్టల్ మీద పడి వాళ్ల నెత్తి మీద వాళ్ల చెయ్యే పెట్టుకున్నరు. ధరణి రద్దు చేస్తే రైతుల బతుకులు ఆగమవుతయ్. ధరణితో భూ రికార్డులు భద్రంగా ఉన్నయ్. నేను నాలుగెకరాల్లో పత్తి పంట సాగు చేస్తు న్న. గతంలో భూములు వివరాలు తెలుసుకోవాలంటే అధికా రుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ధరణితో కార్యాలయాలు, అధి కారుల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లో సులువుగా చూసుకునే వీలు కలిగింది. ఇగ దళారులకు పైసలిచ్చే బాధ కూడా తప్పిం ది. అందుకే ధరణి ఉండాలె. బీఆర్ఎస్ సర్కారూ ఉండాలె.
– అనిల్ యువ రైతు, బండల్నాగపూర్, తాంసి మండలం
కాంగ్రెసోళ్ల కోసమే ధరణి తీస్తమంటున్నరు..
ధరణిని తీసేసి కాంగ్రెసోళ్లు బాగుపడుదామనుకుంటున్నరు. గిప్పుడు గా పోర్టల్తోనే రైతుల భూములకు భద్రత ఉన్నది. గతంలో దళారులకు ఎంతో కొంత ముట్టజెప్పితనే పనులయ్యేది. తెలంగాణ ప్రభుత్వం ధరణి తేవడంతో ఆ తిప్పలు తప్పినయ్. నేను మూడేండ్ల కింద రెండెకరాల భూమి కొన్నా. అంతకుముందు నాకు ఎకరం భూమి ఉండే. నా వద్ద పాత పాస్బుక్ ఉండడంతో కొత్తగా కొన్న భూమి వివరాలు రిజిస్ట్రేషన్ రోజే నా బుక్కులో అధికారులు రాసిన్రు. రూపాయి ఖర్చు కాలేదు. గంట సమయం కూడా పట్టలేదు. ధరణి వల్ల అన్ని విధాలా కరెక్టుగా ఉన్న భూములు అమ్మడం, కొనడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భూ రిజిస్ట్రేషన్ల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ బాగుంది. కొత్త పాస్బుక్లో కొన్న భూమి వివరాలు నమోదు కావడంతో నాకు రైతుబంధు కూడా అందుతున్నది. ఎవరు ఏమన్నా ధరణి చాలా బాగుంది. ఎన్నికలచ్చినయని ఒక్కో పార్టీ ఒక్కో రకం కథ మొదలుపెడుతది. మనం నమ్మొద్దు. నమ్మితే ఆగమైతం. -అరుణ్ గణేశ్, ఇచ్చోడ
కాంగ్రెసోళ్లు కరెంటియ్యరు..
మాది ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుబిడి. మా కుటుంబానికి పన్నెండెకరాల భూమి ఉంది. చక్కగా మూడు పంటలు తీస్తున్నం. నాకు ఇప్పుడు 65 ఏండ్లు. గతంలో పరిస్థితి కళ్లారా చూసినోన్ని. సీఎం కేసీఆర్ వచ్చినంకనే రైతుల బతుకులు బాగుప డినయ్. ఎవుసానికి 24 గంటల కరెంటు ఇస్తున్నరు. దీంతోనే రైతులందరం పెన్గంగ, బోర్ల నుంచి పంట లకు నీళ్లిచ్చుకుంటున్నం, ఇంతవరకు ఎన్నడూ 10 హెచ్పీ మోటర్లు వాడింది లేదు. అవ్విటితోని ట్రాన్స్ ఫార్మర్ల మీద భారం పడుతది. అవ్వి మాటిమాటాకి కాలిపోతయి. గిప్పుడు 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్ల తోని ఏ సమస్యా లేదు. ఎవుసానికి 3 గంటలే చాలని రేవంత్ రెడ్డి అనడం చూస్తంటే ఆయన కు రైతులంటే ఎంత చులకనో తెలుస్తున్నది. రైతులకు మంచి జరిగిందంటే అది ఒక్క సీఎం కేసీఆర్తోనే. ఇన్నేండ్లల్లో నేను చూసిన లీడర్లలో ఆయన కంటే గొప్పోళ్లు లేరు.
-గడ్డం భూమారెడ్డి, రైతు, గుబిడి, భీంపూర్ మండలం