చెన్నూర్ టౌన్, జూన్ 24 : అసలే వర్షాకాలం.. ఇంటా.. బయటా.. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశలెక్కువ. గాలివానకు స్తంభాలు పడిపోయి.. విద్యుత్ తీగలు తెగిపడి.. ఎక్కడ ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వాటి బారి నుంచి తప్పించుకోవచ్చని విద్యుత్శాఖ ఏడీఈ రవికుమార్ సూచిస్తున్నారు. విద్యుత్ వాడకం-తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు.
ప్రమాదాలు ఇలా..
వానకాలంలో ఈదురుగాలులతో విద్యుత్ తీగలు తెగిపోవడం, స్తంభాలు విరిగిపోయి కరెంటు సరఫరా అవుతుండడంతో పశువులతో పాటు ప్రజలు ప్రమాదాల బారిన పడుతుంటారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లినప్పుడు సరైన వైరింగ్ లేక.. డిస్ట్రిబ్యూషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనుమతి లేకుండా ఫ్యూజులు మార్చే సందర్భంలో పలువురు షాక్తో చనిపోతుంటారు.
సొంత మరమ్మతులు వద్దు..
చాలా మంది రైతులు కరెంట్ సమస్యలు వస్తే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఏమవుతుందిలే అన్న ధోరణిలో సొంతంగా మరమ్మతులు చేస్తుంటారు. అది సరికాదు. కరెంట్ స్టార్టర్లకు కచ్చితంగా తలుపులు అమర్చుకోవాలి. మోటర్లపై మందపాటి ప్లాస్టిక్ కవర్ను కప్పి ఉంచాలి. లేదంటే వర్షానికి తడిసి ఒక ఫేస్ తీగ కాలితే మోటర్ మొత్తానికి విద్యుత్ సరఫరా అవుతుంది. దానిని తాకగానే షాక్ కొడుతుంది.
చేయకూడని పనులు..
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అప్రమత్తంగా ఉండాలి
వానకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ వైర్లు తెగిపడినా, నేలవాలినా సొంతంగా రిపేర్లు చేయరాదు. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారాన్ని ఇవ్వాలి. లేదంటే విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలి. వ్యవసాయ బోర్లకు ఏదైనా పాత సర్వీస్ వైరు ఉంటే వాటిని మార్చుకోవాలి. రైతులు మోటర్ల వద్దకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. పొలాల్లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
– ఈ.రవికుమార్, ఏడీఈ, చెన్నూర్ ఆపరేషన్