చెన్నూర్ రూరల్, జనవరి 11: ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు అన్నారు. గురువారం చెన్నూర్ మండలంలోని అంగ్రాజ్పల్లిలోని పీహెచ్సీని ఆయన సందర్శించారు. వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. సబ్ సెంటర్లలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనంతరం ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు కృష్ణ తేజ, హెచ్ఈవో జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు.