ఆసిఫాబాద్,మార్చి 23 : తెలిసీ తెలియక చేసిన తప్పుల వల్ల జైలు జీవితం అనుభవిస్తున్న వారు, విడుదలైన తర్వాత సత్ప్రవర్తనతో కొత్త జీవితం ప్రారంభించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రత్యేక సబ్ జైల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఖైదీల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వైద్య సేవలు అందించాలని అధికారులను సూచించారు. అనంతరం జైలు పరిసరాలను పరిశీలించారు. బ్రహ్మకుమారి ఆర్తి ఖైదీలకు మెడిటేషన్పై శిక్షణ ఇచ్చారు. జైలు సూపరింటెండెంట్ ప్రేమ్ కుమార్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అధికారులు వెంకటేశ్వర్లు, అంజనీ దేవి, జైలు అధికారులు పాల్గొన్నారు.