రామకృష్ణాపూర్, జూన్ 28 : సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల ఎమ్మెల్యే స్వగృహంలో 357 మంది లబ్ధిదారులకు రూ. 3,57,91,470 విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభు త్వం హయాంలో నియోజకవర్గంలో 11 వేల మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించామన్నారు. 12,259 ఒంటరి మహిళలకు, వితంతు పింఛన్లు 786 మందికి, బ్యాంకు లింకేజీ ద్వారా 2018 నుంచి రూ 32. 17 కోట్ల జమ చేశామన్నారు. వడ్డీలేని రుణాలు 2018 నుంచి రూ. 3.36 కోట్లు, రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలో 3055 మందికి సింగరేణి ఇండ్ల పట్టాలు అందించామని చెప్పారు. కేసీఆర్ , న్యూట్రిషన్ కిట్లు 11 వేల మందికి అందించడంతో పాటు 11 గ్రామాల్లో ఒక్కొక్క భవనానికి రూ. 18 లక్షలు వెచ్చించి 100 సమ్మక్క- సారల మ్మ మహిళా భవనాలు నిర్మాణంతో పాటు చెన్నూరు మహిళా భవనకు రూ.1.50 కోట్లు, మందమర్రి మహిళా భవనకు రూ. 2 కోట్లతో నిర్మాణం కొనసాగుతుందని, రామకృష్ణాపూర్ మహిళాభవనకు రూ. 2 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు.
రూ. 10 కోట్లతో చెన్నూరు పట్టణంలో మాతా శిశు సంక్షేమ దవాఖాన, జిల్లాలో నాలుగు మహిళా ఆరోగ్య సెంటర్లు, నియోజకవర్గం మొ త్తం మిషన్ భగీరథ రూ. 128.63 కోట్లతో 61, 948 గృహాలకు 1073 కిలో మీటర్ల పైపులైన్ల ద్వా రా తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. మళ్లీ తెలంగాణలో మెరుగైన పాలన కొనసాగాలంటే కేసీఆర్ ప్రభుత్వమే రావాలని పేర్కొన్నారు. రూ. 28 కోట్లతో చెన్నూరు పట్టణంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, రూ. 20 కోట్లతో మందమర్రి మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, రూ. 15 కోట్లతో క్యాతనపల్లి మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు నిర్మించనున్నట్లు తెలిపారు. చెన్నూరు బస్ డిపో పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రతి గ్రామానికి రవాణా సౌర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామ ని తెలిపారు. గత పాలకులకు దోచుకోవడానికే స మయం సరిపోలేదని, చెన్నూరు నియోజకవర్గా న్ని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మవద్దని, వినవద్దని, మోసపోవద్దని కోరారు. పక్కా రాష్ర్టాల ప్రజలు కూడా తెలంగాణ పథకాలు కావాలని డిమాండ్ చేస్తున్నారని వివరించారు. దేశానికి నాయకత్వం వహించేలా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజవర్గంలోని తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పథకాల అమలు కేసీఆర్కే సాధ్యం
సంక్షేమ పథకాల అమలు సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి. ఇందుకోసం మహిళలు రానున్న ఎన్నికల్లో సీ ఎంకు మద్దతు తెలిపి గెలిపించుకోవాలి. కల్యాణలక్ష్మి చెక్కు తీసుకోవడం సంతోషంగా ఉంది.
-గద్దల నాగమణి, నవ్వ గ్రామం, జైపూర్