బాసర, జూన్ 4 : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా అమ్మవారి దర్శనానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో పాటు వేసవి సెలవులు ముగుస్తుండడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ర్టాలతో పాటు కాకుం డా మహారాష్ట్ర, కర్ణాటక, తదితర రాష్ర్టాల నుంచి భక్తులు తరలి వచ్చారు. అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసాయి. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పలువురు భక్తులు తమ పిల్లలకు అక్షరశ్రీకార పూజలు చేయించారు.