జైనూర్, ఫిబ్రవరి 03. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని జైనుర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించుకోవాలని అసిఫాబాద్ జిల్లా డీఈ బండా వీరేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మూడు మండలాల విద్యుత్ బిల్లులకు సంబంధించిన సమస్యలను జైనూరు మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్స్టేన్లో ఈ నెల 4న నిర్వహించబోయే విద్యుత్ అదాలత్ పాల్గొనాలన్నారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.