నిర్మల్ అర్బన్, డిసెంబర్ 5 : నిర్మల్ జిల్లాలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గండి రామన్న దత్తసాయి ఆలయంలో రూ.50 లక్షలతో నిర్మించిన వాహన పూజ షెడ్డును, దత్తసాయి మందిర కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం దత్తజయంతి వేడుకల్లో పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి ఆలయ వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. గండిరామన్న ఆలయం అభినవ షిర్డీగా విరాజిల్లుతున్నదని, జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రానికి కొలువైందని అన్నారు. రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరిగిపోతున్నదని పేర్కొన్నారు. దత్త జయంతి వేడుకల్లో భాగంగా 48 గంటల అఖండ సాయి నామస్మరణను కామోల్, ఎడ్బిడ్, చించాల సాయి భక్తులు ప్రారంభించి, రూ.లక్ష విలువ గల నాలుగు హార్మోనియంలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, లక్కాడి జైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, సుభాష్ రావు పాల్గొన్నారు.
నాగోబా ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం..
ఇంద్రవెల్లి, డిసెంబర్ 5 : మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని మెస్రం వంశీయులు ఆహ్వానించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు, ఆలయ ప్రారంభోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలను మంత్రికి వివరించారు. మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ మాట్లాడుతూ.. ఆలయ ప్రారంభోత్సవాల వేడుకలకు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో చిన్నుపటేల్, బాజీరావ్పటేల్, సోనేరావ్, దేవ్రావ్, శేఖర్బాబు, నాగ్నాథ్, తుకారాం, కోసేరావ్, ఆనంద్రావ్ తదితరులు పాల్గొన్నారు.
బీటీరోడ్డు పనులకు భూమిపూజ..
సారంగాపూర్, నవంబర్ 5 : సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్ గ్రామంలో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ప్యారమూర్-కదిలి పాపేశ్వర దేవాలయం బీటీ రోడ్డు పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అలాగే రూ.50 లక్షలతో నిర్మించిన దత్తసాయి దేవాలయం పునఃనిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. నిర్మల్ నియోజకవర్గానికి ప్రభుత్వం ద్వారా అత్యధిక నిధులు మంజూరు చేసి, అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాల్వ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయానికి రూ.2 కోట్లు వెచ్చించి, సర్వాంగ సుందరంగా నిర్మించినట్లు చెప్పారు. అడెల్లి పోచమ్మ ఆలయం నుంచి బోథ్ వరకు నిర్మిస్తున్న రోడ్డు ఈ నెల వరకు పూర్తవుతుందన్నారు.
ప్యారమూర్ గ్రామం అవదూత్ మహారాజ్ ఆధ్యాత్మిక ప్రాంతంగా రూపుదిద్దుకున్నదని పేర్కొన్నారు. దని, గ్రామం మొత్తం భక్తి భావనతో కనబడుతుందన్నారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సాయిబాబా ఆలయంలో పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. అవదూత్ మహారాజ్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, సర్పంచ్ ఉప్పాలపు దివ్యారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ఎంపీటీసీ లక్కాడి లయ, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, ఆర్డీవో స్రవంతి, పీఆర్ డీఈ తుకారం, డీఎస్పీ జీవన్రెడ్డి, తహసీల్దార్ సంతోష్రెడ్డి, ఎంపీడీవో సరోజ, నాయకులు శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, లింగారెడ్డి, గంగారెడ్డి, ఇస్మాయిల్, మోహన్రెడ్డి, సాయన్న తదితరులు పాల్గొన్నారు.