నిర్మల్ అర్బన్, జనవరి 6: ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిం చాలని నిర్మల్ డీఈవో డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ట్రస్మా క్రీడాపోటీలు శుక్రవారం ముగిశాయి.ఈ ముగింపు వేడుకలకు హాజరైన డీఈవో విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, వాటిని గుర్తిస్తూ విద్యార్థులందరినీ ఒక్కతాటికి తీసుకువస్తూ ఇలాంటి పోటీలు నిర్వహించిన ట్రస్మాను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తున్నదన్నారు. మైదానాలను ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయి వారిని సైతం ఆటలపై ఆసక్తి పెంపొందిస్తున్నదని చెప్పారు. ముగింపు వేడుకల్లో ఆయా పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం డీఈవో, డీఎస్పీ జీవన్ రెడ్డిని నిర్వాహకులు సత్కరించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, కార్యదర్శి గంగన్న, కోశాదికారి వినోద్, పట్టణ అధ్యక్షుడు చంద్రాగౌడ్, సెక్రటరి పద్మనాభ గౌడ్, ఉపాధ్యక్షుడు మంచిరాల నాగభూషణ్,జిల్లా క్రీడల కార్యదర్శి మొయినొద్దీన్, సాయన్న, పేటా అధ్యక్షులు భూక్యా రమే శ్, భోజన్న, పోతారెడ్డి, ఆయా పాఠశాల కరస్పాండెంట్లు, హెచ్ఎంలు ,ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పీఈటీలు, పీడీలు,ఉపాధ్యాయులు ఉన్నారు.
విజేతలు వీరే…
జిల్లా స్థాయి ట్రస్మా క్రీడా పోటీల్లో ఓవరాల్ చాంపియన్షిప్ టీం ఈవెంట్లలో రవి ఉన్నత పాఠశాల ఓవరాల్ చాంపియన్ షిప్గా నిలిచింది. పలు క్రీడల్లో రవి ఉన్నత పాఠశాల, విజయ ఉన్నత పాఠశాల, నవ భారత్, అభ్యాస పాఠశాల విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. వీటితో పాటు వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్ పోటీలలో విజేతలకు బహుమతులను అందించారు.