బెల్లంపల్లి రూరల్, జనవరి 8 : నిరుపేద విద్యార్థులు గురుకులాల్లో చేరేందుకు సదావకాశం వచ్చింది. సంక్షేమ గురుకులాలకు వన్నె తెస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) కళాశాలల్లో జూనియర్ ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్డబ్ల్యూఆర్ సీవోఈ సెట్ 2024) నోటిఫికేషన్ వెలువడింది.
ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియం చదువుకున్న నిరుపేద విద్యార్థులు కూడా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను రాయవచ్చు. ఎంపీసీ, బైపీసీ,ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వారికి ఇంటర్మీడియెట్ బోధనతో పాటుగా ఐఐటీ, నీట్లాంటి ప్రవేశ పరీక్షలకు సీవోఈల్లో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. ఆంగ్లంలో బోధన ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు మాత్రమే ఉంటుంది. బాలబాలికలకు వేర్వేరుగా సీవోఈ కళాశాలలు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ)లలో మొత్తం 3680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బాలురకు 1680 సీట్లు, బాలికలకు 2000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎస్సీ కేటగిరీకి 75 శాతం, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు 2 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 12 శాతం, మైనార్టీలకు 3 శాతం, జనరల్, ఈబీసీ అభ్యర్థులకు 2 శాతం సీట్లు కేటాయించారు.
రంగారెడ్డి జిల్లాలోని గౌలిదొడ్డిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఒక్కోదానిలో 120 చొప్పున మొత్తం 240 సీట్లు, ఇబ్రహీంపట్నంలో ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఒక్కోదానిలో 40 చొప్పున మొత్తం 80 సీట్లు, సంగారెడ్డిలోని హత్నూరలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఒక్కదానిలో 80 చొప్పున మొత్తం 160 సీట్లు, మిగిలిన అన్ని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఒక్కోదానిలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని గౌలిదొడ్డిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఒక్కోదానిలో 160 చొప్పున మొత్తం 320 సీట్లు, ఖమ్మంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఒక్కోదానిలో 80 చొప్పున మొత్తం 160 సీట్లు, కిస్టాపూర్, మేడ్చల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఒక్కోదానిలో 40 చొప్పున మొత్తం 80 సీట్లతో పాటు మిగిలిన అన్ని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఒక్కోదానిలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో గౌలిదొడ్డి,నార్సింగి, మహేంద్రహిల్స్(బాలికల కళాశాల)లతో పాటు, గౌలిదొడ్డి, చిలుకూరు,షేక్పేట (బాలుర కళాశాలలు), కరీంనగర్ అల్గునూరు (కో-ఎడ్యుకేషన్)తో కలిపి మొత్తం 7 సీవోఈలను ప్రీమియర్ కళాశాలలుగా పరిగణిస్తారు. కామన్ ఎంట్రన్స్టెస్ట్లో రాష్ట్ర స్థాయిలో మెరిట్ సాధించిన వారికే ఈ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మిగిలినవన్నీ నాన్ ప్రీమియర్ సీవోఈలు. ఈ కళాశాలల్లో కూడా మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ప్రస్తుతం పదో తరగతి (టెన్త్ క్లాస్) పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మొదటిసారే పదో తరగతి పాస్ అవ్వాలి. 2024 ఆగస్టు 31 నాటికి 17 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ,ఎస్టీ,కన్వర్టెడ్ క్రిస్టియన్లకు రెండేళ్లు మినహాయింపు ఉంటుంది. కుటంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంత అభ్యర్థులకు రూ.2 లక్షలకు మించకుండా ఉండాలి.
ఇందుకు సంబంధించిన పరీక్ష ఫస్ట్లెవల్,సెకండ్ లెవల్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నా పత్రాలు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు. ఒక్కో టెస్ట్ సమయం మూడు గంటలు ఉంటుంది. 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు నిర్దేశించిన సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఫస్ట్ లెవల్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మొత్తం 160 మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 160 మార్కులు కేటాయిస్తారు.
ఇంగ్లిష్ నుంచి 20, మ్యాథమెటిక్స్ నుంచి 20, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్ నుంచి ఒక్కోదానిలో 40 ప్రశ్నలుంటాయి.
ఇంగ్లిష్ నుంచి 20, మ్యాథమెటిక్స్ నుంచి 40, సోషల్ నుంచి 70, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద మాత్రమే గుర్తించాలి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు పావుమార్కు చొప్పున నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఇక ఎంఈసీ, సీఈసీ అభ్యర్థులకు ఫస్ట్ లెవల్ టెస్ట్లో సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్ (ప్రవేశం) కల్పిస్తారు. ఎంపీసీ, బైపీసీ అభ్యర్థులు మాత్రం సెకండ్ లెవల స్క్రీన్టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ లెవల్ టెస్ట్లో సాధించిన మార్కుల ఆధారంగా ఒక్క సీటుకు ఐదుగురు చొప్పున (1:5) ఎంపిక చేసి సెకండ్ లెవల్ టెస్ట్కు అనుమతిస్తారు. ఈ పరీక్ష డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటుంది. మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజిక్స్,కెమిస్ట్రీల నుంచి ఒక్కోదానిలో 45 మార్కులతో పాటు ఇంగ్లిష్తో కలిపి మొత్తం 150 మార్కులు ఉంటాయి.
కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు 2024 జనవరి 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. హాల్టికెట్లను జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం tsswreiajc.cgg.gov.in ,www.tswreis.ac.in వెబ్సైట్లలో అభ్యర్థులు సంప్రదించవచ్చు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 కళాశాలల్లో 3,680 సీట్లకు దరఖాస్తులు తీసుకుంటుంది. గురుకుల సీవోఈల్లో అందుతున్న నాణ్యమైన విద్యను సక్రమంగా వినియోగించుకుంటే బంగారు భవిష్యత్కు పునాదులు వేసుకున్నట్లే. కళాశాలల్లో చేరాలనుకునే పేద విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి. ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు, ఇతర వివరాల కోసం దగ్గరలోని సీవోఈల ప్రిన్సిపాళ్లను సం ప్రదించవచ్చు.
– కొప్పుల స్వరూపారాణి, రీజినల్ కోఆర్డినేటర్