నస్పూర్, మార్చి 8 : స్మార్ట్ ఫార్ములాతో ద్విచక్రవాహనాన్ని హెల్మెట్కు అనుసంధానించడం అభినందనీయమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడపడం వల్ల జరుగుతున్నప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ హెల్మెట్ను తయారు చేసిన మంచిర్యాల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి వెన్నంపల్లి సిద్ధ్దాంత్సాయిని శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు. సిద్ధాంత్ సాయి అసాధారణ ప్రతిభ కనబరిచాడని ఆయన కొనియాడారు.