పెంబి, డిసెంబర్ 19 : ఆయిల్ పామ్ సాగు బాగుందని, అధిక లాభాలు పొందవచ్చని, రైతులు దృష్టి సారించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం పెంబి మండలంలోని నాగాపూర్లో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గిరిజన రైతు ఉత్పత్తి దారుల సంస్థ, పామాయిల్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 504 మంది రైతులు ఐకమత్యంతో గిరిజన ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా సేవలు అందిస్తుండడం అభినందనీయమని కితాబిత్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, డీఆర్టీవో విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి అంజీప్రసాద్, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ఏవో ఆసం రవి, ఎంపీవో రత్నాకర్రావు, సర్పంచ్ పూర్ణచందర్ గౌడ్, ఏఈవోలు పాల్గొన్నారు.