కాసిపేట, మార్చి 31 : కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం చొప్పరిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. గోదావరిఖనికి చెందిన అల్లివర్ అర్జున్ వద్ద రూ.98500 స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ నగుదును ఎస్ఎస్టీ టీంకు అప్పగించినట్లు సీఐ శశిధర్ రెడ్డి వివరించారు.