ఇచ్చోడ, అక్టోబర్ 12 : అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. మండలకేంద్రంతో పాటు బోరిగామ, జామిడిలోని పలు బెల్ట్ షాపులపై గురువా రం దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళి ప్రకారం ఇచ్చోడలోని పలు షాపులతో పాటు గ్రామాల్లో సోదాలు చేసి రూ.లక్షా 96 వేల విలువైన అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిర్వాహకులు నరల రాజేశ్వర్, టేకం సుభాష్, నర్సయ్య, సుభాష్, రాంచందర్ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇచ్చోడ ఎస్ఐ నరేశ్, రైటర్ దత్తాత్రి, పోలీసులు పాల్గొన్నారు.
ఎదులాపురం, అక్టోబర్12: ఆదిలాబాద్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పిప్పర్వాడ, ఇచ్చోడ ప్రోహిబిషన్ స్టేషన్ పరిధిలో గణ్పూర్లోని చెక్పోస్టులను జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై. హీమాశ్రీ గురువారం తనిఖీ చేశా రు. సిబ్బందితో కలిసి వాహనాలను క్షణంగా పరిశీలించారు. అక్రమ మద్యం , గంజాయి రవాణాను అరికట్టాలని సిబ్బందికి సూచించారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ సీహెచ్ శ్రీనివాస్ ,చెక్పోస్టు సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమంగా మద్యం విక్రయించిన సిరిపుర్వార్ శ్రీనివాస్, భీమనవేని శ్రీకాంత్ను గురువారం రూరల్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. మళ్లీ విక్రయిస్తే రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు ఎక్సైజ్ సీఐ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు.
ఖానాపూర్ రూరల్, అక్టోబర్ 11 : మండలంలోని మస్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సీఎంరావు గార్డెన్ పక్కన గల ఓ దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని ఎస్ఐ లింబాద్రి తన బృందంతో కలిసి పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదుచేశారు. మద్యం విలువ సుమారు రూ. 11860 ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీస్ సిబ్బంది మోహన్ పాల్గొన్నారు.
కుంటాల, అక్టోబర్, 12: మండలకేంద్రంలోని హోటళ్లలో భైంసా గ్రామీణ సీఐ నైలు ఆధ్వర్యం లో గురువారం తనిఖీలు చేపట్టారు. రెండు హోటళ్లలో రూ. 9200 విలువ గల 12 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఏఎస్ఐలు దేవురావు, రాందాస్, సిబ్బంది ఉన్నారు.
భైంసారూరల్ సీఐ నైలు మహారాష్ట్ర సరిహద్దులో గల దౌనెల్లి తండా చెక్పోస్టును తనిఖీ చేశారు. ఎక్సైజ్, ఫారెస్టు సిబ్బంది సహకారంతో సరిహద్దులో వాహనాల తనిఖీ చేపడుతున్నట్లు తెలిపా రు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయ ల్ 100 కు ఫోన్ చేయాలని కోరారు. ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు.
బజాహత్నూర్, అక్టోబర్12 : మండలంలోని దేగామా, పిప్పిరి, గిర్నూర్, చందునాయక్తండాల్లోని బెల్ట్షాపులపై బోథ్ సీఐ భీమేశ్, ఎస్ఐ నరేశ్ ఆధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా మద్యం సీసాలను స్వా ధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దాడులు నిర్వహించనున్నట్లు సీఐ పేర్కొన్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
భీంపూర్,అక్టోబర్12 : మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో అప్రమత్తంగా ఉండాలని బోథ్ నో డల్ ఆఫీసర్, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ అన్నా రు. గురువారం సాయంత్రం భీంపూర్ మండలం సరిహద్దు కరంజి(టీ) చెక్పోస్టును తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. తర్వాత స్థానికులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారు ఎంతటివారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర నుంచి దేశీదారు అక్రమ రవాణా కాకుండా చూడాలన్నారు. నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఐ లాల్సింగ్ నాయక్ , ఎస్బీ సిబ్బంది ఉన్నారు.