కరుణామయుడు, శాంతిదూత యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చిలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేయగా, పాస్టర్లు దైవ సందేశాన్ని అందించారు.
హ్యాపీ క్రిస్మస్.. మేరీ మేరీ క్రిస్మస్.. అంటూ క్రీస్తును స్తుతిస్తూ గీతాలు ఆలపించారు. కేక్లు కట్ చేసి.. మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయా చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.