మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 25: మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. వేకువజామునే చర్చిలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థ్ధనలు చేస్తూ క్రీస్తు నామాన్ని స్మరించారు. పాస్టర్లు క్రీస్తు జననం గురించి ప్రవచనాలను బోధించారు. ప్రజలంతా ఏసు చూపిన బాటలో పయణించి దేవుని దీవెనలు పొందాలని సూచించారు.
అనంతరం భక్తిగీతాలను ఆలపించి కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబురాలను చేసుకున్నారు. ఏసు జన్మ వృత్తాంతం తెలిసేలా చర్చిల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, నడిపెల్లి విజిత్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
జన్నారం, డిసెంబర్ 25: క్రిస్మస్ సందర్భంగా మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చితో పాటుగా గాంధీనగర్, రేండ్లగూడ, శ్రీలంకకాలని, పొనకల్, చింతగూడ గ్రామాల్లోని చర్చిలో క్రిస్టియన్లు తరలివెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం క్రిస్టియన్లు చిన్నా పెద్దలందరూ కొత్త దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ఫాదర్ బోధించిన శోత్రాలను విన్నారు.అనంతరం ఏసుప్రభువు కీర్తనలు పాడి భక్తి పార్వశంలో మునిగిపోయారు. ఈకార్యక్రమంలో ఏసుప్రభువు భక్తులు పాల్గొన్నారు.
దండేపల్లి, డిసెంబర్25: క్రైస్తవులు అత్యంత పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు మండలంలో వైభవంగా జరిగాయి. మండలకేంద్రంతో పాటు తాళ్లపే ట, చెల్కగూడ, నెల్కివెంకటాపూర్, మాదాపూర్, ము త్యంపేట చర్చిల్లో జరిగిన ప్రార్థనలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. చర్చిలో ఫాస్టర్ సందేశాన్ని శ్రద్ధ్దగా విన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తాండూర్, డిసెంబర్ 25 : మండలంలోని రేపల్లెవా డ, రాజీవ్నగర్, కిష్టంపేట, గంపలపల్లి, కొత్తపల్లి, తాం డూర్, ఐబీ, మాదారం తదితర గ్రామాల్లోని చర్చిల వద్ద క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఉదయం నుంచే ప్ర జలు నూతన వస్త్రాలు ధరించి చర్చిలకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సామూహిక భోజనాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
కోటపల్లి, డిసెంబర్ 25: మండలంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని రొయ్యలపలి, దేవులవాడ, కోటపల్లి, మల్లంపేట, జనగామ, కొల్లూర్, అన్నారం, నాగంపేట, బొప్పాం గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక పార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. చర్చిల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చర్చిల వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ గ్రామాలకు చెందిన ఫాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, డిసెంబర్ 25: చెన్నూర్ మండలంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని కిష్టంపేట, ఆస్నాద్, కొమ్మెర, నాగపూర్, సోమన్పల్లి, పొక్కూర్ గ్రామాల్లో క్రిస్మస్ సందర్బంగా చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక పార్థనలు చేశారు. ఏసు ప్రభువు గురించి పాస్టర్లు వివరించారు. మండలంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేసినట్లు పాస్టర్లు తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినం సం దర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన ఫాస్టర్లు, క్రైస్తవ కులస్థులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, డిసెంబర్ 25 : పట్టణంతో పాటు మండలంలోని అన్నీ గ్రామాల్లో క్రైస్తవులు క్రిస్మస్ను ఘనంగా జరుపుకున్నారు. వేకువజాముననే స్నానాలు ఆచరించి కొత్త దుస్తులు ధరించి కుటుంబసభ్యులతో కలిసి సమీపంలోని చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని సీఎస్ఐ చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావుతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి ఫాస్టర్ రెవరెండ్ డెవిడ్పాల్ ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఎమ్మెల్యేను పూలమాలలు, శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చెల్ల నాగభూషణం, రాందేని వెంకటేశ్, రాందేని సుజాత, చింత సువ ర్ణ, పర్వీన్ సుల్తానా, సురేశ్నాయక్, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ శాహెద్ ఆలీతో పాటు నాయకులు చింత అశో క్, పింగిళి రమేశ్, ఆరీఫ్, రాందేని చిన్న వెంకటేశ్, గుత్తికొండ శ్రీధర్, చంద్రమౌళి, నవాబ్, మడిపల్లి స్వామి, ప్రభాకర్రెడ్డి, గోప చిన్నరమేశ్ పాల్గొన్నారు.
మందమర్రి, డిసెంబర్ 25: పట్టణంలో క్రైస్తవ కుటుంబాల ప్రజలు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే క్రైస్తవులు తమ కుటుంబ సభ్యులతో కలసి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా చర్చిల ఫాస్టర్లు భక్తులకు పండుగ ప్రాధాన్యతను వివరించారు. చర్చిలలో ఏసును కొలుస్తూ భక్తులు పలు గేయాలను ఆలపించారు. అనంతరం ఒకరికోకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కన్నెపల్లి, డిసెంబర్ 25 : మండలంలోని ఏసయ్యపల్లె, జన్కాపూర్ గ్రామాల్లో సోమవారం క్రైస్తవులు క్రిస్మస్ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థ్ధనలు చేశారు. ఇండ్లను అందంగా అలంకరించుకొని క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. విందులు చేసుకున్నారు.
వేమనపల్లి, డిసెంబర్ 25 : మండలంలోని నీల్వాయి గ్రామంలోని చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఫాస్టర్ పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంపీటీసీ సంతోష్కుమార్, ఎస్ఐ సుబ్బారావు, సర్పంచ్ గాలి మధులు హాజరై కేక్ కట్ చేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫాస్టర్ ఏసుక్రీస్తు బోధనలను వినిపించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ, క్రైస్తవులు పాల్గొన్నారు.
కాసిపేట, డిసెంబర్ 25 : సోమగూడెం, బెల్లంపల్లి రహదారి మధ్యలోని కల్వరీ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కల్వరీ ఫాస్టర్ ప్రవీణ్ ప్రత్యేక ప్రార్థ్ధనలు చేయగా భారీగా క్రైస్తవులు హాజరై క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్ని ప్రత్యేక ప్రార్థ్ధనలు చేశారు. దీంతో పాటు సోమగూడెం, కాసిపేట, దేవాపూర్ తదితర గ్రామాల్లో చర్చిల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కారుకూరి రాంచందర్, ముత్తినేని రవికుమార్, ముత్తె భూమయ్య, జైన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, డిసెంబర్ 25: పట్టణంలోని సెయిం ట్ పీటర్స్ చర్చితో పాటు పలు చర్చిలలో క్రిస్మస్ను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్లోని సెయింట్ పీటర్స్ చర్చ్లో సోమవారం ఉదయ నుంచే క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ మందిరంలో క్రైస్తవులు లోక శాంతి కోసం ప్రార్థనలు చేశారు. సెయింట్ పీటర్స్ మహాదేవాలయం ఫాస్టర్ రెవ రెండ్ ఎం జాషువా క్రైస్తవ భక్తులను ఉద్దేశించి యేసు క్రీస్తు పుట్టుకను గూర్చిన దైవ సందేశాన్ని తెలియజేశారు.
చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డియోసిస్ సెక్రటరీ డొలకల డేవిడ్ మాట్లాడారు. యేసుప్రభువు పుట్టుక ప్రాధాన్యతను వివరించి ప్రభువు చూపిన మార్గంలో క్రైస్తవ భక్తులు నడుచుకోవాలని ఆ యన సూచించారు. పాస్టరేట్ ట్రెజరర్ ఎం శరత్బాబు, అసిస్టెంట్ ట్రెజరర్ బోడ ప్రభుదయాల్, పాస్టరేట్ కే. దేవానందం, సండే స్కూల్ సూపరిండెంట్ డొలకల ఎస్తేర్ డేవిడ్, ఉమెన్ ప్రెసిడెంట్ ఎం కళావతి జాషువా, ఉమెన్ సెక్రటరీ సీహెచ్ ప్రేమలత రవి, యూత్ సభ్యులు కే. సుషాంత్, సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, డిసెంబర్ 25: సీసీసీ నస్పూర్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల బాధ్యులు కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబురాలు చేసుకున్నారు. సింగాపూర్ ఆర్అండ్ఆర్ కాలనీలోని రక్షణ సువార్త సంఘం చర్చిలో ఫాస్టర్ రామగిరి గిద్యోన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థ్ధనలు నిర్వహించారు. చర్చిల క్రైస్తవులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇక్కడ అట్కపురం సమ్మయ్య, రఘు, రాజ్కుమార్, సతీశ్, రమేశ్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి, డిసెంబర్ 25: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సీఎస్ఐ చర్చి, పెంతెకోస్తు చర్తితో పాటు పలు బస్తీలలో ఉన్న చర్చిలలో ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థ్ధనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కన్నెపల్లి మండలం చాకెపల్లి గ్రామ అర్పణం గాస్పెల్ చర్చిలో ఫాస్టర్ ప్రవీణ్ నిరుపేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు.