కాగజ్నగర్టౌన్, అక్టోబర్ 31: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఛత్ పూజలు సోమవారంతో ముగిశాయి. కాగజ్నగర్ పట్టణంలో స్థిరపడిన ఉత్తరాది రాష్ర్టాల వాసులు ఈ పూజలను వైభవంగా నిర్వహిస్తారు. 48 గంటల పాటు ఉపవాస దీక్షలతో సూర్యభగవానుడిని పూజిస్తారు. కొలను వద్ద దీపాలను వెలిగించి సూర్యభగవానుడికి పూజలు చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, రుక్మిణి దంపతులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఆయా రాష్ర్టాల నుంచి ఇక్కడ స్థిరపడి పండుగలను జరుపుకోవడం సంతోషకరమని, కాగజ్నగర్ మినీ ఇండియాగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అంతకుముందు ఆకాశదీపాన్ని వెలిగించారు. పూజలు ముగిసిన అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. నిర్వహణ కమిటీ అధ్యక్షుడు విజయ్యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వర్రావు, కంపెనీ ప్రతినిధులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.