చెన్నూర్, ఏప్రిల్ 22: తమకు నోటిసులివ్వకుండానే ఆక్రమణల పేరుతో తమ ఇం డ్లు, షాపుల ముందున్న నిర్మాణాలను ఎలా తొలగిస్తారంటూ మున్సిపల్ అధికారులపై చెన్నూర్లోని పాతబస్టాండ్ ప్రాంతంలోని ఇండ్లు, షాపుల యజమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్ పట్టణంలోని పాత బస్టాండ్ (అంబేద్కర్ చౌక్) నుంచి చెరు వు కట్ట వరకు ప్రధాన రహదారి వెడల్పు పనులను బుధవారం మున్సిపాలిటీ అధికారులు ప్రారంభించారు.
ఇందులో భాగంగా మొదటగా రోడ్డుకు ఇరువైపులా మురుగుకాలువలపై ఉన్న ఆక్రమణలు, నిర్మాణాలు జేసీబీతో తొలగించారు. రహదారిని ఎంత మేరకు విస్తరిస్తున్నారో అనే విషయాన్ని రహదారికి ఇరువైపులా ఉన్న తమకు తెలియకుండానే పనులు ప్రారంభించారని ఇంటియజమానులు మండిపడ్డారు. తమకు ఎలాంటి నోటీసులివ్వకుండానే విస్తరణ పనులను ప్రారంభించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.