మామడ, సెప్టెంబర్24 : పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సమసమాజ అభివృద్ధికి, కులమతాలకు అతీతంగా అందరూ పాటుపడాలని ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రయ్య, మునిమనుమడు సంపత్ అన్నారు. మండలంలోని కొరిటికల్ గ్రామంలో ఆదివారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఐలమ్మకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఐలమ్మదేనని పేర్కొన్నారు.
ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో సర్పంచ్ భోజవ్వ, ఎంపీటీసీ అందె సౌజన్య, ఉప సర్పంచ్ కొండ్ర శిరీష, ఐలమ్మ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట పోశెట్టి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, ఉపాధ్యక్షుడు సహదేవ్, మామడ మండలాధ్యక్షుడు ఏటి రాజేశ్వర్, నిర్మల్ మార్కెట్ కమిటీ డైరెక్డర్ నల్ల లింగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, పల్లి రాజేశ్వర్, రమేశ్రెడ్డి, రత్నయ్య, రాజేశ్వర్, అశోక్, శ్రీనివాస్, లింగం, రాజన్న తదితరులు ఉన్నారు.