లక్షెట్టిపేట, మే 23 : మండలంలోని గుల్లకోట గ్రామాన్ని కేంద్ర బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులతో మాట్లాడారు. అధికారులు సకాలంలో గ్రామానికి వచ్చి సమస్యలపై స్పందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
అంతేగాకుండా గ్రామంలో పారిశుధ్య పనులు, ప్రకృతివనం, శ్మశానవాటిక, క్రిమిటోరియం తదితర ప్రాంతాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట ఎంపీడీవో సరోజ, ఎంపీవో ప్రసాద్, పంచాయతీ సెక్రటరీ తదితరులు ఉన్నారు.