ఇంద్రవెల్లి, అక్టోబర్ 14 : ప్రపంచానికి శాంతి, అహింసాయుత మార్గాన్ని చూపిన బుద్ధుని బోధనలు అనుసరణీయమని జీవక్, బుద్ధభూషణ్, రోహన్, దమ్మసాగర్, గౌతం రతన్, రోహన్, బుద్ధ రతన్ అన్నారు. మండలంలోని మిలింద్నర్ త్రిరత్న బుద్ధవిహార్లో మూడు నెలలుగా నిర్వహిస్తున్న బుద్ధ దమ్మ గ్రంథం ప్రవచనాలతో పాటు వర్షవాస్ దివస్ శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధ ఉపాసకులు బుద్ధుడి ప్రవచనాలు బోధించారు. అనంతరం మండలకేంద్రంలోని మిలింద్నగర్ నుంచి బుద్ధ దమ్మ గ్రంథంతోపాటు అంబేద్కర్ ప్రతిమలతో వందలాది మందితో భారీ శోభాయాత్ర నిర్వహించారు.
బుద్ధనగర్, ప్రబుద్ధనగర్, భీంనగర్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు భారీ శోభాయాత్రతో చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఫూలమాల వేసి నివాళులర్పించారు. సామూహిక బుద్ధవందన, దమ్మవందన, సంఘవందన చేశారు. కార్యక్రమంలో దమ్మచక్ర యూత్ అధ్యక్షుడు సునీల్కాంబ్లే, మహామాయ ఉపాసిక మహిళా సంఘ్ అధ్యక్షురాలు మాయాబాయి సోమోరే, బౌద్ధ ఉపాసకులు మస్కే రాజ్వర్ధన్, కుచ్రుబా, కామ్రాజ్, బాబు, లక్ష్మణ్, గౌతం సోమోరే, విక్రమ్, ఉత్తం కాంబ్లే, సాహుదాస్ పాల్గొన్నారు.