మందమర్రి, ఏప్రిల్ 14 : సింగరేణిలో అనేక హక్కులు సాధించిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ అన్నా రు. ఆదివారం మందమర్రి పట్టణంలోని యూనియన్ కార్యాయంలో టీబీజీకేఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పటి బీఆర్ఎస్ సర్కారు సహకారంతో గుర్తింపు సంఘంగా సింగరేణి బొగ్గుగని కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు అనేక హక్కులు సాధించామన్నారు. దశాబ్దాల క్రితం రద్దయిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని కారుణ్య నియామకాల పేరిట తిరిగి పునరుద్ధరించిన ఘనత తమ యూనియన్దేనని తెలిపారు. యూనియన్ నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు సంపత్, ఓ.రాజశేఖర్, ఈశ్వర్, బెల్లం అశోక్, ముల్కలపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.