‘భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులే మా బలం.. బలగం. గులాబీ శ్రేణులే మా సైన్యం. బీఆర్ఎస్ గుర్తుపై ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే మీ స్నేహితుడిగా, బంధువుగా, ఇంట్లో మనిషిగా, సైనికుడిగా సేవ చేస్తా. మీ మధ్యే ఇరవై ఏండ్లుగా ఉంటున్నా. ప్రజల బాధలు, ఆశలు, ఆశయాలు, సమస్యలు నాకు బాగా తెలుసు. వాటి పరిష్కారానికి నా శాయశక్తులా కృషి చేస్తానని మాటిస్తున్నా. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో దూసుకెళ్లేట్టు చేస్తా. నాకు టికెట్ కేటాయించినప్పటి నుంచి ప్రతి గడపకూ తిరిగా. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తమ ఇంటి బిడ్డగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. వృద్ధులు ఆత్మీయతగా మాట్లాడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని భావిస్తున్నా.’ అని బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ అనిల్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘నమస్తే’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
– ఆదిలాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ) : ‘ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. పదేండ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ ప్రయోజనం చేకూర్చాయి. ప్రచారంలో ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్న దని, అందుబాటులో ఉండే వాడిగా గుర్తించి ఓటు వేస్తామనే భరోసా ఇస్తున్నా రు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి. అటవీ భూముల ను సాగు చేస్తున్న గిరిజనులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయ డంతోపాటు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో మంచి స్పందన వస్తున్నది. నా యకులు, కార్యాకర్తలతో కలిసి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్తు తనను ఆశీర్వదిం చాలని కోరుతున్నా.’ అని బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ అనిల్కు మార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘నమస్తే’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
జాదవ్ అనిల్ : బోథ్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహి స్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన రోజునే ప్రచారం ప్రారంభించా. మండలాలు, గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు తమ ప్రాం తాల్లో ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తొమ్మిది మండలాల్లో బైక్ ర్యాలీలు, నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎంపీ నగేశ్, జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఇతర నాయకుల సహకారంతో ప్రచారాన్ని ఉధృతం చేశా. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తల ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
జాదవ్ అనిల్: బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. గ్రామాలకు వెళ్లినప్పుడు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. డప్పు చప్పుళ్లు, పటాకులు పేలుస్తూ, నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. సమా వేశాలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. వృద్ధులు కేసీఆర్ను తమ పెద్ద కొడుకుగా, ఆడబిడ్డలు మేన మామగా భావిస్తూ కారు గుర్తుకు ఓటు వేస్తా మంటున్నారు. ప్రజల ఆశీర్వాదం చూస్తుంటే భారీ మెజార్టీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.
అనిల్ జాదవ్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. పదేళ్లుగా అమలు చేస్తుండడంతో ఇంటిం టికీ చేరాయి. కనీసం మూడు నుంచి ఏడు పథకాలు లబ్ధి పొందుతున్న కుటుం బాలు ఉన్నాయి. కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో సంతో షంగా ఉన్నారు. గ్రామాల్లో పేదల ఉపాధి మెరుగుపడింది. నేను 20 ఏండ్లుగా ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట, సుఖాల్లో పాలు పంచుకుంటున్నా.
అనిల్ జాదవ్: ప్రతి పక్షాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. నియోజకవ ర్గంలో బీజేపీ, కాంగ్రెస్లకు స్థానం లేదు. బీజేపీ అభ్యర్థి అధికారం కోసం పార్టీ లు మారే వ్యక్తి. కాంగ్రెస్ పెద్దలు టికెట్లు అమ్ముకుంటున్నట్లు ఆ పార్టీ నాయకు లు అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వైఖరికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే. గ్రామాల్లో వారి ప్రచారానికి కనీస స్పందన లేదు. బీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టి ఆరు గ్యా రెంటీలు అని కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రస్తుత ఎం పీగా ఉన్న బీజేపీ ఎంపీ సోయం బాపురావు నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదు. రెండు పార్టీలు ఎంత తిరిగినా పట్టించుకోవడం లేదు.
అనిల్జాదవ్: బోథ్ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వు చేయబడింది. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల పాలనలో గిరిజనులు ఉపాధి లేక ఇబ్బందులు పడ్డా రు. ఆదివాసీ గూడేలు, తండాలకు కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి నోచుకోలే దు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న అటవీ భూములకు ప్రభుత్వం ప ట్టాలు పంపిణీ చేసింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నది. గిరివికాసం పథకంలో భాగంగా వ్యవసాయ భూములకు ఉచితంగా రూ.2.5 లక్షలతో బోరు, త్రీఫేజ్ కరెంటు, కరెంటు మోటరు సౌకర్యం కల్పిస్తున్నారు. గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. గిరిజన గ్రామాలకు రూ.70 కోట్లతో ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించింది. గిరిజనుల జాతరలు, పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వ హిస్తోంది. గిరిజనులు బీఆర్ఎస్కు అండగా ఉన్నారు.