ఆదిలాబాద్ : మహిళా ఎస్ఐ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జిల్లాలోని జైనథ్ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త విశాల్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి కేసులు బనాయించారని అంటూ ఆదివారం సాయంత్రం బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు జైపూర్ పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించారు.
ఈ ఆందోళనలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ జైనథ్ ఎస్సై పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మహిళా ఎస్సై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పై చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. మహిళా సంఘాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.