మాజీ మంత్రి జోగు రామన్న
ఎదులాపురం, ఏప్రిల్ 11 : కేంద్రం దృష్టి పెట్టి మహాత్మ జ్యోతిబాపూలే దంపతులకు భారతరత్న అందజేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. మహానీయుడు మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ స్టడీ సరిల్లో గల మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామన్న నివాళులర్పించారు. ఫూలే ఆశ సిద్ధాంతం దిశగా ప్రతి ఒకరూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు అజయ్, గండ్రత్ రమేశ్, మెట్టు ప్రహ్లాద్, సాజితుద్దీన్, దాసరి రమేశ్, చందాల రాజన్న, పందిరి భూమన్న, కొండ గణేశ్, దమ్మాపాల్, బట్టు సతీష్, లక్ష్మణ్, మౌర్య సురేందర్, కలీం, కరుణ, ఉమా మహేశ్వరి, రాజ్ సిద్ధర్, మహేష్, దివిటి రాజు, అనిల్ పాల్గొన్నారు.
పూలే సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే జాదవ్ అనిల్
నేరడిగొండ, ఏప్రిల్ 11 : మహాత్మ జ్యోతిబాపూలే సేవలు మరువలేనివని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కొనియాడారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి, స్థానిక సర్పంచ్ నీలిమ, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లె నానక్సింగ్, సీనియర్ నాయకులు సయ్యద్ జహీర్, అంబేకర్ పండరి, సర్పంచ్ ఆడెపు శ్రీకాంత్, నాయకులు రాథోడ్ సురేందర్, లచ్చన్న, భూషణ్, విశాల్, ప్రతాప్సింగ్, సుజిల్, నవీన్ పాల్గొన్నారు.