కమాన్చౌరస్తా, మే 12 : సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ అల్ఫోర్స్ సత్తా జయకేతనం ఎగురవేసింది. విద్యాసంస్థల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించడంతో తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమైంది. అల్ఫోర్స్ చైర్మన్ వీ నరేందర్రెడ్డి కొత్తపల్లిలోని ఈ టెక్నో స్కూల్ ఆవరణలో విజేతలను శుక్రవారం అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పదో తరగతి ఫలితాల్లో జే వామిక 495 మారులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింనట్లు చెప్పారు.
ఎన్ అనిరుధ్ సాయి 492, బీ శ్రీహిత 487, ఏ శివాశ్రిత 487, 73 మంది విద్యార్థులు 450కి పైగా మారులు సాధించారని వెల్లడించారు. 12 వ తరగతిలో పీ వేదవిష్ణు 486, డీ అశ్వితారెడ్డి 484, శికారి చందన 478, ఆర్ సుహాసిత 473, నిషాంత్ పర్వల్ 471, 30 పై విద్యార్థులు 400కు పైగా మారులు సాధించారన్నారు. అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల సహకారంతోనే అత్యుత్తమ ఫలితాలు సాధించామని చెప్పారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని పేర్కొన్నారు. విజేతలను అభినందించారు.