ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 4: దుబాయ్ దేశంలోని అజ్మాన్నగరంలో ఎమిరెట్స్ తెలంగాణ సంస్కృతి సంఘం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాల్లో నిర్మల్ జిల్లా ప్రాంత మహిళలతో పాటు ఇతర జిల్లాల వారు పాల్గొన్నట్లు సంఘం అధ్యక్షుడు రాధారపు సత్యం తెలిపారు. అయితే బతుకమ్మ సంబురాలే గాకుండా దసరా నవరాత్రి ఉత్సవాలు, విజయ దశమి, రానున్న దీపావళి పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటామని అన్నారు. ఈ వేడుకల్లో ఇతర రాష్ర్టాలకు చెందిన మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో సంఘం వ్యవస్థపాక అధ్యక్షుడు పీచర కిరణ్ కుమార్, మహిళా విభాగం ఇన్చార్జి అల్లూరి సరోజ, అసోసియేషన్ చైర్మన్ దినేశ్, యుఏఈ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు శేఖర్గౌడ్, కార్యదర్శులు రాజేశ్వర్, రాణి, సాయిచందర్, రాజశేఖర్ పాల్గొన్నారు.