మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్, జూన్ 15 : బాసర ఆర్జేయూకేటీ విద్యాలయం సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆర్జేయూకేటీ విద్యాలయంలో సౌకర్యాలు, ఇతర అంశాలను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.