ఆదిలాబాద్ టౌన్, జనవరి 20 : కంటి వెలుగు కార్యక్రమంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి శిబిరాలకు వెళ్లి పరీక్షలు చేయించుకునే విధంగా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్లోని కొలిపుర, గ్రామీణ మండలంలోని అంకోలి, అంకాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. శిబిరాలకు హాజరైన ప్రజలతో మాట్లాడారు. కంటి చూపు, పరీక్షలు, తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పని తీరు, రికార్డుల నమోదు, పరీక్షల విధానం, మందులు, కంటి అద్దాల పంపిణీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శిబిరాల్లో పని చేసే సిబ్బంది ప్రతి రోజూ ఉదయం 9 గంటల లోపు విధులకు హాజరుకావాలన్నారు. సర్పంచ్లు, వార్డు సభ్యులు వారి పరిధిలోని ప్రజలను శిబిరాలకు పంపిస్తూ కంటి పరీక్షలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్వో సాధన, ప్రత్యేకాధికారి రమణ, ఎంపీవో ఆనంద్, కౌన్సిలర్ రవి, పాల్గొన్నారు.
ఇచ్చోడ, జనవరి 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నరేశ్ కోరారు. మండలంలోని కొకస్మన్నూర్, నర్సాపూర్, ఇస్లాంగనగర్లో కంటి వెలుగు శిబిరం కొనసాగుతోంది. డాక్టర్ హిమబిందు సాగర్ నరేశ్ ఆధ్వర్యంలో కంటి సమస్య ఉన్న వారికి పరీక్షలు చేసి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ 146 మందికి కంటి పరీక్షలు చేశామని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
భీంపూర్, జనవరి 20 : భీంపూర్ మండలం కరంజి(టీ) ఆరోగ్య ఉపకేంద్రంలో రెండో విడుత కంటి వెలుగు శిబిరంలో తొలిరోజు 216 మందికి పరీక్షలు చేసి అద్దాలు అందజేశారు. పరీక్షల పరంగా తొలిరోజు కరంజి(టీ) జిల్లాలోనే మేటిగా నిలిచింది. మరింత శ్రద్ధగా సిబ్బందితో కలిసి పని చేస్తామని వైద్యాధికారి నిఖిల్రాజ్ తెలిపారు. రెండో రోజు కూడా పరీక్షలు కొనసాగించారు. ప్రత్యేకాధికారి గోపీకిషన్ పర్యవేక్షించారు. ఇక్కడ హెచ్ఈవో జ్ఞానేశ్వర్, సిబ్బంది గంగాధర్, లూసి, సుజాత, గోదావరి, విష్ణు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
ఉట్నూర్, జనవరి 20: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ సంతోష్ కంటి సమస్యతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పంచాయతీ ఈవో శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.