ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 18: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా విద్యార్థిని కాంస్యం సాధించినట్లు గిరిజన సంక్షేమ శాఖ క్రీడాధికారి మీనా రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ గిరిజన క్రీడా పాఠశాలలో ఎం సాక్షి(9వ తరగతి)అండర్ 14 జావెలిన్ త్రో విభాగంలో అత్యంత ప్రతిభ చూపినట్లు పేర్కొన్నారు. 29.97 మీటర్ల దూరం విసిరి ఈ పతకం కైవసం చేసుకున్నట్లు తెలిపారు.
సాక్షితో పాటు ట్రైనర్ విద్యాసాగర్ని ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ రమాదేవి, ఏసీఎంవో, పీ ఉద్ధవ్, ఏటీడీవో క్షేత్రయ్య, జీసీడీవో శకుంతల, తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కే సారంగపాణి, జాయింట్ సెక్రెటరీ పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఇండియన్ అథ్లెటిక్స్ టీం కోచ్ నాగపురి రమేశ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, కోట్నాక విజయ్, సట్ల శంకర్, గుండా లక్ష్మణ్, హ్యాండ్ బాల్ శిక్షకులు అరవింద్, ఖోఖో శిక్షకులు తిరుమల్, టీం మేనేజర్ పిట్టల స్వప్న, జిల్లాలోని పీఈటీలు, క్రీడా పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.