ఆదిలాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభంకానుంది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) గత నెల 9న షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా.. ఈ రోజు నోటిఫికేషన్ వెలువరించనుంది. 10వ తేదీ వర కు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యా హ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తా రు.
ఈ నెల 5న ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు నామినేషన్లు తీసుకోరు. నామినేషన్ల స్వీ కరణ కోసం ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ ని యోజకవర్గాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశా రు. రిటర్నింగ్ అధికారితోపాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. పోటీ చేసే అభ్యర్థు లు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి. నామపత్రాన్ని ఫాం-2బీ ఎన్నికల అధికారి కార్యాలయంలో ఇస్తారు. 13న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణ ఉంటుంది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ని ఐదు నియోజకవర్గాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది.
పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను నాలుగు సెట్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ పత్రాన్ని ఫారం-2లో అందజేయాలి. ఈ ఫారంతో అఫిడవిట్ జతపర్చాలి. రెండు స్టాంపు సైజు ఫొటోలను ఒకటి నామినేషన్ ఫారంపై, మరొకటి అఫిడవిట్పై పెట్టాలి. నామినేషన్ వేసే అభ్యర్థి ఎన్నికల కోసం బ్యాంకు ఖాతా తీసి ఖర్చులు చూపించాలి. జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీ తరఫున నామినేషన్ వేసేటప్పుడు ఒకరు ప్రతిపాదించాలి. ఇండిపెండెంట్లకు పది మంది ప్రతిపాదించాలి. నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి నలుగురికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.