ఆసిఫాబాద్, ఆగస్టు 18 : దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకోవాల్సిన అవసరం అందరిపై ఉన్నదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఏజెన్సీ గ్రామాల్లో గౌడ కులస్తులకు లైసెన్సులు ఇచ్చేందుకు సహకరించాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హాలు , పాపన్న విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశం, జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్, బీసీ సంక్షేమాధికారి సత్యనారాయణరెడ్డి, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్హైమద్, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ జగ్గాగౌడ్, నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్, మహేశ్, శాంతి కుమార్, లక్ష్మీనారాయణ, మురళి, మహిళలు నీరజ, ఆరుణ, ఆసిఫాబాద్, కాగజ్నగర్, రెబ్బెన, గంగాపూర్ గీతా పారిశ్రామిక సహకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కోటపల్లి మండలంలో..
చెన్నూర్ రూరల్ (కోటపల్లి), ఆగస్టు 18: కోటపల్లి మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో
మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాపన్న గౌడ్ చేసిన సేవలలను కొనియాడారు. అనంతరం గౌడ కులస్తుల సమస్యలను మాజీ ఎమ్మెల్సీకి మోకు దెబ్బ మండల అధ్యక్షుడు ముత్యాల సంపత్ గౌడ్ వివరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న మోకు దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు గట్టు లక్ష్మణ్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు పబ్బ మొండె గౌడ్, కార్యదర్శి బైరి సమ్మగౌడ్, కులస్తులు పెద్దపోలు సాంబాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు బైస ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.