కెరమెరి, డిసెంబర్ 31: పోలీసులు విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ డీఎస్పీ వెంకటరమణ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో ఉన్న పోలీస్స్టేషన్ను సందర్శించి గదులు, పలు రికార్డులను తనిఖీ చేశారు. ముందుగా పోలీసులు సిబ్బంది డీఎస్పీకి గౌరవ వంద నం చేసి స్వాగతం పలికారు.
అనంతరం పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్, బ్లూకోల్ట్, క్రైమ్ టీం, కోర్టు డ్యూటీ అధికారి, స్టేషన్ రైటర్, క్రైమ్ రైటర్, ప్రాసెస్ అప్లికేషన్ల పని తీరును తనిఖీ చేశారు. అనంతరం పెండింగ్లో ఉన్న కేసుల రికార్డులు, నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నా రు. ఈ కార్యక్రమంలో వాంకిడి సీఐ శ్రీనివాస్, ఎస్ ఐ విజయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.