బెల్లంపల్లిరూరల్, ఫిబ్రవరి 2 : ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం ఈ నెల 4న నిర్వహించనున్న సీవోఈ ఎంట్రెన్స్ టెస్ట్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆదిలాబాద్ రీజియన్ కో ఆర్డినేటర్ కొప్పుల స్వరూపారాణి తెలిపారు. శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లి సీవోఈలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులుతో కలిసి ప్రవేశపరీక్షకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి 5918 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్టికెట్లు సంస్థ వెబ్సైట్ tsswreiajc.cgg.gov.in, www. tswreis.ac.in లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు 3వ తేదీలోపు డౌన్లోడ్ చేసుకోని పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. ప్రవేశపరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1723 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 1495, మంచిర్యాల జిల్లాలో 2700 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకులాలు ఆదిలాబాద్ బాలికల గురుకులం నుంచి 648,బోథ్ బాలికలు 648, ఇచ్చోడ బాలురు 255, ఆదిలాబాద్ మహిళా డిగ్రీ కళాశాల నుంచి 172 మంది,
ఆసిఫాబాద్ బాలుర గురుకులం 528, సిర్పూర్ బాలికల గురుకులం 347, సిర్పూర్ బాలుర గురుకులం 347, రెబ్బెన బాలికల గురుకులం 273, బెల్లంపల్లి బాలుర గురుకులం (సీవోఈ) 504, బెల్లంపల్లి బాలికల గురుకులం 480, చెన్నూర్ బాలికల గురుకులం 550, లక్షెట్టిపేట బాలికల గురుకులం 480, జైపూర్ బాలుర గురుకులం 285, బెల్లంపల్లిలోని కాసిపేట బాలుర గురుకులం 401మంది విద్యార్థులు సీవోఈ ప్రవేశపరీక్షకు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. ఆర్సీవో వెంట బెల్లంపల్లి బాలికల, కాసిపేట గురుకులాల ప్రిన్సిపాళ్లు సందనరాజ స్వరూప, ఊటూరి సంతోష్కుమార్, వైస్ ప్రిన్సిపల్ రాజ్కుమార్, జేవీపీ పొన్నం శ్రీనివాస్, పరీక్షల ఇన్చార్జి వరమని ప్రమోద్కుమార్ ఉన్నారు.