ఇంద్రవెల్లి, జనవరి 9: ప్రజల ద్వారా స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులను పకడ్బందీగా ఆన్లైన్లో నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన ఆరు గ్యారెంటీల దరఖాస్తుల ఆన్లైన్ నమోదు వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో మొత్తం 12,272 దరఖాస్తులు రాగా 4,630 ఆన్లైన్లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మండలంలోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న వారి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. చేసిన ఆన్లైన్ నమోదు వివరాలు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో సంతోష్కుమార్ ఉన్నారు.
మండల వ్యాప్తంగా 33 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సభల ద్వారా సేకరించిన ప్రజాపాలన ఆరు గ్యారెంటీల దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. మండలంలో మొత్తం 14,842 దరఖాస్తులు రాగా 7,631 ఆన్లైన్లో నమోదు చేశామని ఎంపీడీవో సుశీల్రెడ్డి తెలిపారు. మండల పరిషత్, ఈజీఎస్, బోథ్ జీపీ, తహసీల్ కార్యాలయాల్లో 25 కంప్యూటర్ల ద్వారా ఆన్లైన్ నమోదు ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారి జీవన్రెడ్డి పర్యవేక్షణలో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు తమ జీపీలకు సంబంధించిన దరఖాస్తులను దగ్గరుండి ఆన్లైన్ చేయిస్తున్నారు.