నిర్మల్ అర్బన్, జనవరి 12: నిర్మల్ జిల్లా లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. మామాఅల్లుడిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో మామ మృతి చెందగా, అల్లుడి పరిస్థితి విషమంగా ఉంది. నిర్మల్ మండలం అనంతపేట్ గ్రామానికి చెందిన పోలీస్ బుచ్చ న్న తన అల్లుడు వెంకటేశ్తో కలిసి నిర్మల్లో దవాఖానకు వెళ్లి, తిరిగి గ్రామానికి వస్తున్నా డు.
శుక్రవారం సాయంత్రం బంగల్పేట్ జంగల్ హనుమాన్ వద్ద బైక్పై వెళ్తున్న వీరిపై గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. పోలీస్ బుచ్చన్న(55) ముఖంపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. అల్లుడు వెంకటేశ్ కడుపుపై దాడి చేయడంతో పేగులు బయటపడి, ప్రాణాపాయ స్థితి లో ఉన్నాడు. స్థానికులు ఆయనను 108లో జిల్లా దవాఖానకు తరలించారు.
వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ బుచ్చన్నకు భార్య, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ గంగారెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాస్ జిల్లా దవాఖానకు చేరుకొని వెంకటేశ్తో మాట్లాడారు. బుచ్చన్న కొడుకుల్లో ఒకరు గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ కక్షలతోనే హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. కాగా, పోలీసుల అదుపులో ఇద్దరు ఉన్నట్లు సమాచారం.