ఉట్నూర్, సెప్టెంబర్ 1 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఉట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు క్రీడా సామర్థ్యాలను పెంపొందించేందుకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థికి ఆటలంటే ఆసక్తి ఉంటుందని కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఖోఖో, హాకీ ఇష్టమైన ఆటలలో వారిని ప్రోత్సహించాలన్నారు. క్రీడల నుంచి వ్యక్తి వికాసం, ఓటమిలో తట్టుకోవడం, విలువలు నేర్చుకోవడం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో డీడీ దిలీప్, జిల్లా క్రీడాధికారి పార్థసారథి, ఏసీఎంవో జగన్, కోచ్లు బాలసుందర్, భూమన్న, కబీర్దాస్, రమేశ్, పీఈటీలు పాల్గొన్నారు.