నేరడిగొండ, ఫిబ్రవరి 17 : గిరిజన విద్యార్థులు చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్లో సత్తా చాటాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని లఖంపూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో బోథ్ డివిజన్ పరిధిలోని 14 ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు స్టార్ కల్చరల్ యాక్టివిటీస్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులకు తరగతి బాధ్యతలతో పాటు వార్షికోత్సవం, కల్చరల్ వేడుకల వంటి వాటిని నిర్వర్తించేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కల్చరల్ యాక్టివిటీస్ విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.
కల్చరల్ యాక్టివిటీస్ ప్రారంభం
లఖంపూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బోథ్ డివిజన్ పరిధిలోని గిరిజన పాఠశాలల విద్యార్థులకు నిర్వహిస్తున్న స్టార్ కల్చరల్ యాక్టివిటీస్ను శుక్రవారం జడ్పీటీసీ జాదవ్ అనిల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని 14 గిరిజన పాఠశాలల విద్యార్థులకు 9 ఈవెంట్లకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ఈజీ రైటింగ్, క్విజ్, ఎలక్షన్, డ్రాయింగ్, పెయింటింగ్, స్పెల్బీ, రంగోళి, మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఇక్కడ ఎంపీపీ రాథోడ్ సజన్, బోథ్ ఏటీడీవో సౌజన్య, పీవీటీజీ ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్, ఏసీఎంవో జగన్, డీఎస్డీవో పార్థసారథి, హెచ్ఎంలు రాథోడ్ ప్రకాశ్, రాథోడ్ అనూష, కృష్ణారావ్, ఉత్తందాస్, స్థానిక పాఠశాల హెచ్ఎం అశోక్రావ్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.