బీఆర్ఎస్ అభ్యర్థులు అలుపెరుగకుండా ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. పల్లెల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ సర్కారు చేపట్టిన ప్రగతిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, విఠల్రెడ్డి, అనిల్ జాదవ్ జాన్సన్ నాయక్ గురువారం విస్తృతంగా ప్రచారం చేయగా, ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఆప్యాయంగా పలకరిస్తూ.. మ్యానిఫెస్టోపై అవగాహన కల్పిస్తూ ముందుకుసాగారు. పలు పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. గెలుపే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మామడ, అక్టోబర్ 19 : హామీల అమలు సీఎం కేసీఆర్కే సాధ్యమని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని మారుమూల గ్రామం వాస్తాపూర్ హనుమాన్ ఆలయంలో గురువారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా తాండ్ర గ్రామం నుంచి వాస్తాపూర్ వరకు బైక్ ర్యాలీగా మంత్రిని ఆహ్వానించారు. అనంతరం మంత్రికి గిరిజనుల సంప్రదాయ గుస్సాడీ నృత్యం, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. యువకులు డీజే సౌండ్కు నృత్యం చేయగా, మంత్రి వారితో కలిసి స్టెఫ్ వేసి వారిని ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాస్తాపూర్ గ్రామానికి రోడ్డు సరిగా లేక అనేక ఇబ్బందులు పడేవారని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు సౌకర్యం కల్పించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, సర్పంచ్ సంతోష్, డీసీసీబీ డైరెక్టర్ హరీశ్కుమార్, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, నాయకులు గంగారాం పటేల్, భూంరెడ్డి, అరవింద్రావు, ముత్యంరెడ్డి, భాస్కర్రావు, రాందాస్, కిచ్య, కైలాస్, గంగాధర్, కిష్టునాయక్, లింగు, సీతారం, మహేందర్ తదితరులు ఉన్నారు.
దిలావర్పూర్, అక్టోబర్ 19 : మండలంలోని న్యూ లోలం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సమక్షంలోశుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలోఅన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశామన్నారు. మూడోసారి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరా రు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పీవీ రమణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల చిన్న దేవేందర్రెడ్డి, రైతుబందు సమితి మండలాధ్యక్షుడు కోడే రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు పాల్ధే అనిల్, బొడ్డు గంగయ్య, స్వామిగౌడ్, రషీద్, సజ్జు, భామని ముత్యం, రాములు, రవి, గంగన్న, సాయి తదితరులు ఉన్నారు.