కెరమెరి, జనవరి 8 : ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన అక్షింతల శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. బ్యాండ్ వాయిద్యాలు.. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజారి బాపుదేవ్ మహారాజ్ ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మండలంలోని 31 గ్రామపంచాయతీల సర్పంచ్లు, గ్రామప్రముఖులకు అక్షింతలు పంపిణీ చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బోనగిరి సతీష్బాబు, కొనిపాక వేణుగోపాల్, కేంద్రే విశాల్, సిద్ధంశెట్టి సుహాసిని, వెంకటేశ్, ఆవిడపు ప్రణయ్, ఎంపీపీ పెందోర్ మోతీరాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆనంద్రావ్, గ్రామప్రముఖులు గిత్తే గణేశ్, ఎల్లప్ప, రామారావ్, నాగుపటేల్, రామకృష్ణ, సెండే నారాయణ, తిరుపతి, కేంద్రే జగన్, రాథోడ్ ఉత్తం నాయక్, వాడై సుధాకర్ పాల్గొన్నారు.