హాజీపూర్, పిభ్రవరి 12 : మండలంలోని వేంపల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్కేఎం నర్సింగ్ కళాశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ పురుషులు, మహిళల హ్యాండ్బాల్ జట్లను సోమవారం ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకొని పొటీలు ప్రారంభించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొనగా, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యామ్సుందర్ రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు.
జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల పొటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్బాల్ కోచ్లు అరవింద్, రాజలింగు, పీడీలు సదానందం, పద్మ, అలివేలు, పీఈటీలు సంజీవ్, మహేశ్, రమేశ్, కళ్యాణ్ పాల్గొన్నారు.