బేల, అక్టోబర్ 2 : సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలలోని గణేశ్ గార్డెన్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆదివారం లబ్ధిదారులకు పింఛన్కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 790 మందికి పింఛన్ కార్డులు అందజేశామని తెలిపారు. రాని వారికి త్వరలోనే రెండో విడుతలో వస్తాయని హామీ ఇచ్చారు. దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసి దేశంలో మన మాదిరిగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యాచరణ రూపొందిస్తారని అన్నారు. బీజేపీ నాయకులు మాత్రం ధర్నాలతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. ప్రజలు అభివృద్ధి చేసే పార్టీలకు ఆదరించాలన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వనితాఠాక్రే. తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఎంపీడీవో భగత్ రవీందర్, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, జక్కుల మధుకర్, ఇంద్రశేఖర్, మంగేశ్ ఠాక్రే, బండి సుదర్శన్, సర్పంచ్లు , ఎంపీటీసీలు, అధికారులు , పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.