ముథోల్, డిసెంబర్ 16 : అటవీ భూములకు తప్పనిసరిగా హద్దులు గుర్తించాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఫారెస్ట్ అధికారి (ఐజీ) ఈలా మురుగన్ సూచించారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో దాదాపు 75 ఎకరాల రెవెన్యూ భూములను ఫారెస్టుకు అప్పగించారు. దీంతో వాటి సరిహద్దులు, విస్తీర్ణం, తదితర వాటిని గురువారం ఆయన పరిశీలించారు. అటవీ భూము ల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ ప్రభు త్వం తీసుకోవడంతో ఫారెస్టుకు ఈ భూమిని కేటాయించిందని తెలిపారు. గతంలో ఈ భూమిని సిబ్బంది పరిశీలించి నివేదికలు పంపారని వివరించారు. ఇందులో భాగంగా ఈ భూమి పరిశీలనకు వచ్చినట్లు పేర్కొన్నారు. త్వ రలోనే సమస్యలు లేకుండా ఫారెస్టు భూమిగా చేర్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఫారెస్టు ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుతామని వివరించారు. ఇచ్చిన రెవెన్యూ భూముల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈయన వెంట ఖానాపూర్ డీఎఫ్వో కోటేశ్వర్ రావు, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో సురేశ్ బాబు, ఎంపీటీసీ గంగాధర్, సర్పంచ్ సాయినాథ్, ఫారెస్టు అధికారులున్నారు.