జైనథ్, సెప్టెంబర్ 28 : పోలీసులు మహారాష్ట్ర సరిహద్దు వెంబడి కట్టుదిట్టమైన నిఘా ఉంచా లని, అసాంఘిక కార్యకలాపాల కట్టడిపై దృష్టి సారించాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి ఆదేశించారు. జైనథ్ మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయాన్ని బుధవారం పరిశీలించా రు. ముందుగా పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. స్టేషన్ ఆవరణ ను పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల గురించి సీఐ కోల నరేశ్ను అడిగి తెలుసు కున్నా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని జైనథ్, బేల, భీంపూర్ మండలాలకు మహారాష్ట్ర బార్డర్ ఉన్నందున పోలీసులు ఎప్పు డు అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యక లాపాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశిం చారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకు నేలా చూడాలని, ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధు లు, ప్రజలతో మాట్లాడాలని పేర్కొన్నారు.
శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని, స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల అమర్యాదగా ప్రవర్తించ వద్దని సూచించారు. ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమై సమాజంలో నేరాలపై ప్రజల్లో చర్చించి వారికి అవగాహన కల్పిస్తూ ఉండాలన్నారు. డయల్ -100, సైబర్ నేరాలపై ప్రజలను ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించా రు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతు న్నాయని వాటి నివారణకు ప్రతి రోజూ అంత ర్రాష్ట్ర రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. త్రిబుల్ రైడింగ్పై, హెల్మెట్ధారణపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని అన్నారు. పిప్పర్వాడ చెక్పోస్ట్ వద్ద అకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ కోల నరేశ్, జైనథ్ ఎస్ఐ పెర్సిస్ బిట్ల, బేల ఎస్ఐ కృష్ణకుమార్, భీంపూర్ ఎస్ఐ రాధిక, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.