నార్నూర్,ఆగస్టు19: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఆసరా పింఛన్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఆదిలా బా ద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గాదిగూడ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో 48మంది లబ్ధిదారులకు శుక్రవారం ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామన్నారు. ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న ప్రభుత్వానికి ఎల్లప్పుడు రుణపడి ఉండాలని కోరారు. గతంలో ఇలాంటి పథకాలు లేవన్నారు. గత పాలకులు హామీలకే పరిమితమయ్యారన్నారు. టీఆర్ఎస్ ప్రభు త్వం హామీ ఇస్తే.. తప్పకుండా దశల వారీ గా హామీ నెరవేరుస్తుందన్నారు. అలాగే ఉత్తమ అవార్డు గ్రహీతలను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆడ చంద్రకళ రాజేశ్వర్,వైస్ ఎంపీపీ మర్సివనే యోగేశ్, తహసీల్దార్ ఆర్కా మోతీరామ్, ఎంపీడీవో రామేశ్వర్, ఎంఈవో రాపెల్లి ఆశన్న, నాయకులు ఉన్నారు.