ప్రజలకు సురక్షిత ప్రయాణం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఆర్టీసీ యాజమా న్యం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. పంద్రాగస్టున పుట్టిన చిన్నారులకు 12 ఏండ్ల పాటు ఉచిత ప్రయాణం కల్పించింది. ఆర్టీసీకి ఆదరణ మరింత పెంచేలా చేపట్టిన ఈ కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 200 మందికి ఈ సువర్ణావకాశం దక్కినట్లు ఆర్టీసీ యంత్రాంగం చెబుతున్నది.
నిర్మల్ టౌన్/మంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 17: ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సజ్జనార్ ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యంగా పలు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రజలు ఆదరించి లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ ఆర్టీసీ ద్వారా ముత్యాల తలంబ్రాలు, మామిడిపండ్ల పంపిణీ, వృద్ధులు, గర్భిణులు, పెన్షనర్లకు ఉచిత ప్రయాణం, మాతృదినోత్సవం రోజున తల్లులకు ఉచిత ప్రయాణం వంటి కార్యక్రమాలు అమలు చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12ఏళ్ల వరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఉచిత ప్రయాణం అమలు చేస్తుండగా, ఆగస్టు 15న పుట్టిన పిల్లలందరికీ మరో ఏడేళ్ల పాటు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. దీంతో తల్లిదండ్రులు జీవితంలో మరచిపోలేని అనుభూతిగా అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భైంసా డిపో ల్లో మొత్తం 606 సర్వీసులు నడుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు 15న ఉదయం ఒంటి గంట నుంచి రాత్రి 12గంటల వరకు మొత్తం 200 మందికి పైగా పిల్లలు జన్మించినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వీరందరికీ 12 ఏండ్ల పాటు ఉచిత ప్రయాణం అమలు కానుండడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాపకు జీవితాంతం గుర్తుంటుంది..
మాది కామారెడ్డి జిల్లాలోని తాండూరు గ్రామం. మా అమ్మానాన్నలు నిర్మల్లో ఉంటరు. నాకు ఏడాది క్రితం తాండూర్ గ్రామానికి చెందిన కమలాకర్తో లగ్గం చేసిన్రు. కాన్పుకని అమ్మవాళ్లింటికి వచ్చిన. ఆగస్టు 14న పురిటినొప్పులు రాగా, నిర్మల్ ప్రసూతి దవాఖానలో చేర్పించిన్రు. 15న డాక్టర్లు కాన్పు చేయగా, పాప పుట్టింది. పాపకు 12 ఏండ్ల పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణమని అందరూ చెబుతున్నరు. చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్య్ర వేడుకలని ఆర్టీసీ ఇంత మంచి కార్యక్రమం పెట్టడం బాగుంది. ఇది పాపకు జీవితాంతం గుర్తుండిపోతుంది.
-అనూష, తాండూర్, కామారెడ్డి జిల్లా
బాబుకు బహుమతి..
మాది మంచిర్యాల లోని అండాలమ్మ కాల నీ. నాకు రెండో కాన్పు లో ఆగస్టు 15న బాబు పుట్టిండు. ప్రభుత్వ ద వాఖాన్లనే నార్మల్ డెలివరీ చేయించుకున్న. పంద్రాగస్టున పుట్టినో ళ్లకు ఆర్టీసీ బస్సులో 12 ఏండ్ల దాకా ఉచిత ప్రయాణం కల్పించడం బాగుంది. ఇది నా బాబుకు బహుమతి. మేం ఎవుసం చేసుకొని బతుకు తం. ప్రభుత్వ దవాఖాన్ల కేసీఆర్ కిట్ ఇస్తున్నరు. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పిన్రు. ఆర్టీసీలో మంచి మంచి పథకాలు పెడుతున్నరు. ఇలాంటివి తెలంగాణలనే సాధ్యం. -మౌనిక, మంచిర్యాల
సీఎం సారు సల్లగుండాలే..
మాది మంచిర్యాల లోని జాఫర్ నగర్. మా ఆయన బాబా మంచిర్యాలలో చిన్న హోటల్ నడిపిస్తరు. ఈ నెల 15న నాకు పాప పుట్టింది. ప్రభుత్వ దవాఖాన్లనే కాన్పు చేయించుకున్న. సీఎం కేసీఆర్ సారు ఆడబిడ్డల కోసం ఎన్నో పథకాలు తెచ్చిండు. ఇప్పుడు పంద్రాగస్టున పుట్టినోళ్లకు ఆర్టీసీలో 12 ఏండ్ల దాకా ఫ్రీ ప్రయాణం కల్పించుడు పేదింటి పిల్లలకు ఎంతో ఉపయోగపడు తది.ముందు తరాల కోసం మరిన్ని పథ కాలు తేవడానికి సీఎం కేసీఆర్ సారు సల్లగుండాలే…
-ఎస్కే ఫర్జా న, మంచిర్యాల