శ్రీరాంపూర్, ఆగస్టు 11: శ్రీరాంపూర్ ఓసీపీ, ఆర్కే 5గనులపై కార్మికులకు అధికారులు త్రివర్ణ పతాకాలు అందజేశారు. ఓసీపీపై జీఎం సంజీవరెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి పాల్గొన్నా రు. ప్రతి జెండా ఎగురవేసి, దేశ సమైక్యతను చాటాలని పిలుపు నిచ్చారు. పీవో పురుషోత్తంరెడ్డి, మేనేజర్ జనార్దన్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, ఈఈ చంద్రశేఖర్, శ్యాంసుందర్రావు, పీఎం కాంతారావు, సేఫ్టీ ఆఫీసర్ వీరయ్య, వెల్ఫేర్ ఆఫీసర్ శంకర్, సర్వే ఆఫీసర్ సంపత్ పాల్గొన్నారు. ఆర్కే 5 గనిపై మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, ఏజెంట్ ఏవీ రెడ్డి, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి టీ సత్యనారాయణ కార్మికులకు జాతీయ జెం డాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైజీఎం చంద్రశేఖర్, గ్రూప్ ఈఈ వీరన్న, సేఫ్టీ ఆఫీసర్ శివయ్య, సీనియర్ పీ వో బీ రణదీప్, పిట్ ఈఈలు రాధాకృష్ణ, సందీప్, డిప్యూటీ మే నేజర్ రాంచందర్, రాజేశ్ పాల్గొన్నారు.
సీసీసీ కార్మికవాడల్లో..
సీసీసీ నస్పూర్, ఆగస్టు 11: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్ర మం కొనసాగింది. వార్డు పరిధిలోని గోదావరికాలనీ షిర్కె కా ర్మిక వాడల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, స్థానిక వా ర్డు కౌన్సిలర్ కుర్మిళ్ల అన్నపూర్ణ జెండాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఆధ్వర్యంలో అం దజేస్తున్న జాతీయ జెండాలు ప్రతి ఇంటిపై సగౌరవంగా ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటిచెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుర్మిళ్ల మోహన్, చిట్టంపల్లి నరేశ్, సాయికుమార్, మేకల జితేందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, నీరటి లచ్చన్న, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంపల్లి,ఆగస్టు 10: మందమర్రి ఏరియా శాంతిఖని గని ఆవరణలో గురువారం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గని ఆవరణలో ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో ఉద్యోగులకు జాతీయ జెండాలను పంపిణీ చేశా రు. ప్రాజెక్ట్ అధికారి కే.వెంకటేశ్వర్లు, మేనేజర్ సంజయ్కుమార్ సిన్హా, యాక్టింగ్ రక్షణాధికారి ముస్తఫా, పిట్ ఇంజినీర్ బీ రాం బాబు, వెంటిలేషన్ అధికారి పూర్ణచందర్, టీబీజీకేఎస్, ఏఐటీ యూసీ నాయకులు వెంకటరమణ, దాసరి తిరుపతిగౌడ్, అధికారులు,కార్మికులు పాల్గొన్నారు.
రామగుండం రీజియన్లో..
యైటింక్లయిన్ కాలనీ, ఆగస్టు 11: ఆర్జీ-2 ఏరియా పరిధిలోని కాలనీ పుర వీధుల గుండా విద్యార్థులు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏరియా జీఎం టీ. వెంకటేశ్వర్రా వు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సింగరేణి పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా, తె లంగాణ చౌరస్తా మీదుగా పాఠశాల వరకు కొనసాగింది. గుర్తిం పు సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ఎస్వోటూజీఎం ఎస్. సాంబయ్య, ఓసీపీ-3 ఏజెంట్ మోహన్ రెడ్డి, ఇతర అన్ని విభాగాల ఉన్నతాధికారులు రాధాకృష్ణారావు, జీ. రాజేంద్రప్రసాద్, ధనుంజయ్, ఎర్రన్న, మురళీకృష్ణ, బింగి మాధవరావు, చంద్రమౌళి, సుబ్రమణ్యం, డాక్టర్ గౌతమి, ధనలక్ష్మీబా యి, పీవీ రమణ, రాధాకృష్ణ, పాఠశాల హెచ్ఎం పురుషోత్తం, టంగుటూరి రాజయ్య, జీ. లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
రామగిరి, ఆగస్టు 11: స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భా గంగా గురువారం ఆర్జీ-3 ఏరియాలో ర్యాలీ చేపట్టారు. జీఎం కార్యాలయం నుంచి ఎస్వోటూ జీఎం రఘుపతి ర్యాలీని ప్రారంభించగా, అధికారులు, కార్మిక నాయకులు, ఉద్యోగులు జాతీయ జెండాలతో పాల్గొన్నారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, డీజీఎం చంద్రశేఖర్, డీవైపీఎం మారుతి, సీనియర్ పీవో రాజేశం, విద్యార్థులు ఉన్నారు.
గోదావరిఖని, ఆగస్టు 11: ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-5 ఓసీపీ లో గని కార్మికులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. గని మేనేజర్ అనిల్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు హాజరై కార్మికులకు జాతీయ జెండాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వో శ్రీనివాస్, డబ్ల్యూవో ఫిరోజ్ఖాన్, జేఈ సురేందర్, టీబీజీకేఎస్ నాయకులు కుశనపల్లి శంకర్, స దయ్య, ఉదయ్ భాను ఉన్నారు.