ఎదులాపురం, ఆగస్టు 3 : భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్రెడ్డి అన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బైక్ ర్యాలీ జిల్లాకు చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రదేశాల నుంచి రైల్వే సిబ్బందితో కలిసి ఇలాంటి ర్యాలీలు ఈ నెల 15న ఢిల్లీకి చేరుకుంటాయని తెలిపారు. ఇలాంటి ర్యాలీలు ప్రజల్లో దేశభక్తిని పెంచే విధంగా తోడ్పాటునందిస్తాయని తెలిపారు. అనంతరం ర్యాలీకి జిల్లా నుంచి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ పాశ్వాన్, పైలెట్ ఆఫీసర్ సయ్యద్ మన్నన్, రైల్వే ఏఎస్ఐ సురేశ్ పాల్గొన్నారు.
పదోన్నతి మరింత బాధ్యత…
పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్రెడ్డి అన్నారు. జిల్లాలో పదోన్నతి పొందిన 12 మంది కానిస్టేబుళ్లకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అభినందనలు తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో జి.భవిత, కే.అడెల్లు, జీ.గోవిందరావు, టీ.ప్రభాకర్, కే.రాములు, ఎల్.కిష్టయ్య, ఎస్.సంతోష్, జే.రమేశ్, జే.దేవీదాస్, మహమ్మద్ అజాజుద్దీన్, కే.భీమ్రావు, ఎల్.శ్రీనివాస్ ఉన్నారు. కార్యక్రమంలో సీసీ దుర్గం శ్రీనివాస్, అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత పాల్గొన్నారు.